China New Map: అరుణాచల్లోని కొన్ని ప్రాంతాలపై చైనా వాదన కొత్తేమీ కాదు.. కేంద్రంపై కపిల్ సిబల్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China New Map: చైనా తన అధికారిక మ్యాప్ను విడుదల చేసింది. చైనా తన కొత్త మ్యాప్ను విడుదల చేసినప్పటి నుంటి భారత రాజకీయాల్లో వేడి పెరిగింది. ఈ కొత్త మ్యాప్లో భారత్లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్, తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని చైనా తన భూభాగంగా చూపింది. కొత్త అధికారిక మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్లను చైనా క్లెయిమ్ చేయడంపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఇలా అన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలపై చైనా వాదన కొత్తేమీ కాదు.. ఇదేం మొదటి సారి కాదని.. వారికి మనమంటే ఏంటో చూపించాలని కానీ ఇప్పుడు అలాంటిదేం జరగడం లేదన్నారు. అనేక స్థాయిల్లో చర్చలు జరిగినా ఇలా ఎందుకు జరగుతుందని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కపిల్ సిబల్.. ‘చైనా మనకంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ అని స్వయంగా విదేశాంగ మంత్రి చెప్పారు. కాబట్టి మనం పెద్దగా ఏమీ చేయలేం, చర్చలు జరిపే సామర్థ్యం మనకు లేదనిపిస్తోంది.” అని ఆయన మండిపడ్డారు.
Read Also: China: చైనా మ్యాపులపై భారత్ అభ్యంతరం.. స్పందించిన డ్రాగన్ కంట్రీ..
Also Read
- KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
విదేశాంగ మంత్రి ప్రకటనలపై ఎంపీ సిబల్ మండిపడ్డారు. అనేక స్థాయిల్లో చర్చలు జరిగాయని, చైనా సేనలు వెనక్కి వెళ్లాలని విదేశాంగ మంత్రి చెబుతున్నారని… కానీ ప్రకటనల వల్ల పరిష్కారం రాదన్నారు. మనం పెద్ద ఆర్థిక శక్తిగా మారినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అప్పుడే వారితో సమానంగా మాట్లాడగలరని విదేశాంగ మంత్రిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
అదే సమయంలో చైనా అంశంపై కూడా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. ప్రధానమంత్రిని ఉద్దేశించి కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ “లడఖ్లో ఒక్క అంగుళం భూమి కూడా పోలేదని ప్రధాని చెప్పినది అబద్ధమని.. తాను చాలా సంవత్సరాలుగా ఈ విషయం గురించి చెబుతున్నానన్నారు. చైనా మన భూమిని ఆక్రమించిందని లడఖ్ మొత్తానికి తెలుసు. . ఈ మ్యాప్ విషయం చాలా తీవ్రమైనది. వారు భూమిని లాక్కున్నారు. దాని గురించి ప్రధానమంత్రి ఏదైనా చెప్పాలి.” అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!