Andhrapradesh: గుడ్డు తిని చిన్నారి మృతి.. బాధిత కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh: గుడ్డు తిని చిన్నారి మృతి చెందడంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. గత ఏడాది కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లి అంగన్వాడీ కేంద్రంలో గుడ్డు తిని చిన్నారి మృతి చెందింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన మానవ హక్కుల సంఘం బాధిత కుటుంబానికి రూ.8లక్షల పరిహారం ఇవ్వాలని అంగన్వాడీ టీచర్, అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాలపై అధికారులు హైకోర్టుకు వెళ్లడంతో మానవహక్కుల సంఘం నిర్ణయం సరైనదేనని సమర్థించింది. అంగన్వాడీ కేంద్రంలో.. కుళ్లిన కోడిగుడ్డు తిని ఓ చిన్నారి మృతి చెందిన కేసులో.. మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ని హైకోర్టు కొట్టివేసింది. చిన్నారి మరణం మానవ తప్పిదంగానే ధర్మాసనం పేర్కొంది.
Read Also: Fake notes: నకిలీ నోట్లొస్తున్నాయి.. జాగ్రత్త
Also Read
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
అసలేం జరిగిందంటే.. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లి అంగన్వాడీ కేంద్రంలో 2022 ఫిబ్రవరిల కోడిగుడ్డు తిని అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్న ఓ చిన్నారి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే కన్నుమూసింది. కుళ్లిన కోడిగుడ్డు పెట్టడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని పాప తల్లిదండ్రులు చెబుతున్నారు. అంగన్వాడీ కేంద్రంలో గురువారం ఉదయం పిల్లలకు టీచర్ కోడిగుడ్లు ఇచ్చారు. కాసేపటికే దీక్ష అనే చిన్నారి వాంతులు చేసుకుంది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే పాప మరణించినట్లు వెద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై అంగన్వాడీ టీచర్ను వివరణ కోరగా…తాము సరఫరా చేసిన గుడ్లు బాగానే ఉన్నాయన్నారు. ఈ ఘటన గురించి పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హెచ్ఆర్సీ(మానవ హక్కుల సంఘం) విచారణ జరిపింది. చిన్నారి తల్లిదండ్రులు సరిత, మురేగేష్లకు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని ఈ ఏడాది జనవరి 31న తీర్పు ఇచ్చింది. ఆ సొమ్మును చెల్లించాలని అంగన్వాడీ టీచర్, కుప్పం తహసీల్దార్, శిశుసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, చిత్తూరు జిల్లా కలెక్టర్ తదితరులను ఆదేశించింది. మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై అధికారులు హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన కోర్టు.. పరిహారం విధించడం సరైనదే అని పిటిషన్ను కొట్టివేసింది.
తాజావార్తలు
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!