CM Revanth: గూగుల్లో చెప్పేదే నిజం అనుకుంటారు.. పుస్తకాల్లో దొరికేదే నిజమైన సమాచారం
- ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ను ప్రారంభం
- సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రులు జూపల్లి, పొన్నం
- బుక్ ఫెయిర్లో ఏర్పాటు చేసిన బుక్ స్టాల్స్ను సందర్శించిన సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బుక్ ఫెయిర్లో ఏర్పాటు చేసిన బుక్ స్టాల్స్ను సందర్శించారు. అనంతతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అశోక్ నగర్లో చిన్న స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ బుక్ ఫెయిర్.. ఈ రోజు ఈ స్థాయికి చేరినదుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు చేరువ కావాల్సిన పనిలో తప్పకుండా కృషి చేస్తామని తెలిపారు. ఇక్కడ చాలా పుస్తకాలతో ఎంతో విజ్ఞానం ఉంది.. ఇప్పుడు ఉన్న జనరేషన్ కేవలం గూగుల్ పైనే ఆధారపడుతున్నారు.. గూగుల్లో చెప్పేదే నిజం అనుకుంటారు.. కానీ పుస్తకాల్లో దొరికేదే నిజమైన సమాచారం అని సీఎం తెలిపారు. వారిని వారు గొప్పగా చూపించుకోవడానికి చరిత్రను మార్చి పెట్టుకోవడం గత 10 సంవత్సరాలు చూశాం.. ఈ పుస్తక ప్రదర్శన కోసం అవసరమైన భవనం ఏర్పాటుకు తన సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. అందుకు అవసరమైన విషయాలను ప్రొఫెసర్ కోదండరాం పరిశీలించాలని కోరుతున్నానని సీఎం అన్నారు.
Read Also: Jethwani Case: ముంబై నటి జత్వానీ కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం వంటిదని అన్నారు. నేటి సమాజంలో పుస్తకాలు పఠనం తగ్గింది.. చైతన్యం పరిజ్ఞానం కలిగించేది చదువు.. ప్రతి ఒక్కరూ కూడా పుస్తక పఠనం చేయడం అవసరం అని మంత్రి తెలిపారు. ఇక్కడ ఇంత పెద్ద పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక పుస్తకం కొనడానికి ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తుంది.. కానీ అందరికీ అవసరమైన పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి కాబట్టి అందరూ వినియోగించాలని చెప్పారు. ఈ పుస్తక ప్రదర్శన జాతీయ స్థాయికి చేరాలని మంత్రి పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఉన్న విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాలను చదవాలని అన్నారు. ఎక్కడో సుల్తాన్ బజార్లో తిరిగితే విద్య రాదు.. ఈ బుక్ ఫెయిర్ అందరూ వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ బుక్ ఫెయిర్ మరింత పెద్దగా ఏర్పాటుకు ముఖ్యమంత్రి సహకారంతో ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీ క్రీడా యాప్ లాంచ్.. ఇక, వారికి చెక్..!
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!