Revanth Reddy: భద్రాద్రి రామయ్య సాక్షిగా హామీ ఇస్తున్నా.. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: “దిగిపో దిగిపో అంటున్నావ్… ఉత్తగ వచ్చామా బిడ్డా కేసీఆర్… మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబాబాద్ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఆగష్టు 15లోగా రైతులకు రెండు లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ చేస్తామని హమీ ఇచ్చారు. రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని పేర్కొన్నారు. మానుకోట కాంగ్రెస్ కంచుకోట అని.. పదేళ్లలో మహబూబాబాద్ ప్రాంతం విధ్వంసమైందన్నారు. మోడీ, ఫామ్ హౌస్ కేడీ తెలంగాణను దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. మోడీ తెచ్చిన చట్టాలకు కేసీఆర్ మద్దతు తెలిపారన్నారు. తండ్రి రెడ్యానాయక్ను ఇంటికి పంపినట్టే బిడ్డ మాలోతు కవితను కూడా ఇంటికి పంపాలన్నారు.
Read Also: Jaggareddy: బీజేపీ నేతలు డూప్లికేట్ దేశభక్తులు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని పక్కకు పెట్టారని.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియా గాంధీ మంజూరు చేస్తే… మోడీ లాథూర్కు తరలించుకుపోయారని ఆరోపించారు. ములుగు గిరిజన యూనివర్సిటీని సోనియా గాంధే మంజూరు చేశారన్నారు. ఈ ప్రాంత ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్, బీజేపీకి లేదన్నారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోడీ తెలంగాణను అవమాన పరిచారన్నారు. అప్పుడు పార్లమెంట్లో తానే ప్రత్యక్ష సాక్షిననని పేర్కొన్నారు. ఉత్తర భారత దేశంలోని కుంభమేళాకు వేల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం… మేడారం జాతరకు ముష్టి 3 కోట్లు ఇచ్చారన్నారు. మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వబోమని చెప్పిన బీజేపీ కిషన్ రెడ్డి ఓట్లు అడగడానికి సిగ్గు లేదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను కేసీఆర్ తాకట్టు పెట్టారని ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి పదవుల్లోనూ తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. వందరోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణ ద్రోహులకు ఒక్క ఓటు వేయొద్దు.. ఒక్క సీటు ఇవ్వొద్దు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియమ్మ. సోనియమ్మ బిడ్డను ప్రధాని చేసే బాధ్యత మనపై ఉంది. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారు. తెలంగాణ నుంచి 14 ఎంపీలను గెలిపించి సోనియమ్మకు కానుకగా ఇద్దాం. రైతులకు రెండింతలు ఆదాయం తెస్తానన్న మోదీ రైతులను కాల్చి చంపారు. ప్రతీ పేదవాడికి ఇల్లు ఇస్తానన్న మోదీ తెలంగాణకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు.. దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం అంటూ చాంతాడంత హామీలు ఇచ్చి కేసీఆర్ మోసం చేశారు.. మా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం.. అప్పుడే రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చలేదు దిగిపొమ్మంటున్నారు.. దిగిపోవడానికి ఇక్కడున్నది అల్లాటప్పా వ్యక్తి కాదు.. రేవంత్ రెడ్డి… కేసీఆర్.. నన్ను దింపడం నువ్వు కాదు కదా..నీ అయ్యతరం కాదు.. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం… ప్రజా పాలన అందించి తీరుతాం.. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసి పేదవాడి బిడ్డల కళ్లలో ఆనందం చూసాం. ఆగస్టు 15లోగా 2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. భద్రాద్రి రాముడి సాక్షిగా నేను మాట ఇస్తున్నా… పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత మాది.. వచ్చే పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి తీరుతాం.. బలరాం నాయక్ ను రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించండి..” అని సీఎం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!