Chennai: వైరల్ వీడియోలో పోలీసులను దుర్భాషలాడిన దంపతులు అరెస్టు..
- పోలీసులను దుర్భాషలాడిన దంపతులు అరెస్టు
- మెరీనా బీచ్లో రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను తిట్టిన దంపతులు
- డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు ఫోన్ చేస్తానని బెదిరింపులు
- వీడియో సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్కు ఫోన్ చేస్తానని బెదిరిస్తూ నైట్ పెట్రోలింగ్ పోలీసులను దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చెన్నైకి చెందిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మెరీనా బీచ్లోని లూప్ రోడ్లో జరిగింది. అక్కడ రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు.. చంద్రమోహన్, ధనలక్ష్మి అనే దంపతులను ప్రశ్నించారు.
Read Also: No Romance in Cab: క్యాబ్లో రొమాన్స్ చేయకండి.. డ్రైవర్ వార్నింగ్
Also Read
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
పోలీసులు వారిని విచారించగా తీవ్రంగా స్పందించారు. ఆశ్చర్యమేంటంటే.. దంపతులు పోలీసులపై దుర్భాషలాడారు. దీంతో.. పోలీసులు వారు తిడుతున్న ఘటనను వీడియో తీశారు. ఆ వీడియోలో, ఆ దంపతులు కెమెరాకు పోజులిచ్చి.. పోలీసులను కించపరిచే పేర్లతో బూతులు తిట్టారు. అంతేకాకుండా.. అసభ్య పదజాలంతో దూషించారు. ఒక పోలీసును “బల్లిలా కనిపిస్తున్నారు” అని కూడా దుయ్యబట్టారు. భర్త చంద్రమోహన్ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్తో సంబంధాలు ఉన్నాయంటూ వాదించాడు. “నేను ఉదయనిధి స్టాలిన్ని పిలవనా? నన్ను చూస్తే మీ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ పారిపోతాడు.” మరుసటి రోజే మీ చిరునామాలను ట్రాక్ చేస్తానని బెదిరించాడు, తనను అరెస్టు చేయలేరని చెప్పాడు.
Read Also: Maharashtra: గడ్చిరోలిలో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టు మృతి
వారు అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు పదే పదే చెప్పినప్పటికీ.. చంద్రమోహన్ అధికారులను ఎగతాళి చేస్తూ.. తనను అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు లేదన్నాడు. కాగా.. ఈ దంపతులు చేసిన హంగామా.. అసభ్య పదజాలం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అగౌరవంగా ప్రవర్తించిన దంపతులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వినియోగదారులు డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన అధికారులు.. ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి ఆ దంపతులను కనిపెట్టారు. చంద్రమోహన్, ధనలక్ష్మిలను వెలచ్చేరిలోని ఓ లాడ్జిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మైలాపూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..