Chennai: వైరల్ వీడియోలో పోలీసులను దుర్భాషలాడిన దంపతులు అరెస్టు..
- పోలీసులను దుర్భాషలాడిన దంపతులు అరెస్టు
- మెరీనా బీచ్లో రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను తిట్టిన దంపతులు
- డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు ఫోన్ చేస్తానని బెదిరింపులు
- వీడియో సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్కు ఫోన్ చేస్తానని బెదిరిస్తూ నైట్ పెట్రోలింగ్ పోలీసులను దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చెన్నైకి చెందిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మెరీనా బీచ్లోని లూప్ రోడ్లో జరిగింది. అక్కడ రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు.. చంద్రమోహన్, ధనలక్ష్మి అనే దంపతులను ప్రశ్నించారు.
Read Also: No Romance in Cab: క్యాబ్లో రొమాన్స్ చేయకండి.. డ్రైవర్ వార్నింగ్
Also Read
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
పోలీసులు వారిని విచారించగా తీవ్రంగా స్పందించారు. ఆశ్చర్యమేంటంటే.. దంపతులు పోలీసులపై దుర్భాషలాడారు. దీంతో.. పోలీసులు వారు తిడుతున్న ఘటనను వీడియో తీశారు. ఆ వీడియోలో, ఆ దంపతులు కెమెరాకు పోజులిచ్చి.. పోలీసులను కించపరిచే పేర్లతో బూతులు తిట్టారు. అంతేకాకుండా.. అసభ్య పదజాలంతో దూషించారు. ఒక పోలీసును “బల్లిలా కనిపిస్తున్నారు” అని కూడా దుయ్యబట్టారు. భర్త చంద్రమోహన్ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్తో సంబంధాలు ఉన్నాయంటూ వాదించాడు. “నేను ఉదయనిధి స్టాలిన్ని పిలవనా? నన్ను చూస్తే మీ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ పారిపోతాడు.” మరుసటి రోజే మీ చిరునామాలను ట్రాక్ చేస్తానని బెదిరించాడు, తనను అరెస్టు చేయలేరని చెప్పాడు.
Read Also: Maharashtra: గడ్చిరోలిలో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టు మృతి
వారు అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు పదే పదే చెప్పినప్పటికీ.. చంద్రమోహన్ అధికారులను ఎగతాళి చేస్తూ.. తనను అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు లేదన్నాడు. కాగా.. ఈ దంపతులు చేసిన హంగామా.. అసభ్య పదజాలం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అగౌరవంగా ప్రవర్తించిన దంపతులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వినియోగదారులు డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన అధికారులు.. ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి ఆ దంపతులను కనిపెట్టారు. చంద్రమోహన్, ధనలక్ష్మిలను వెలచ్చేరిలోని ఓ లాడ్జిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మైలాపూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
తాజావార్తలు
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!