Chennai: వైరల్ వీడియోలో పోలీసులను దుర్భాషలాడిన దంపతులు అరెస్టు..
- పోలీసులను దుర్భాషలాడిన దంపతులు అరెస్టు
- మెరీనా బీచ్లో రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను తిట్టిన దంపతులు
- డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు ఫోన్ చేస్తానని బెదిరింపులు
- వీడియో సోషల్ మీడియాలో వైరల్.
తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్కు ఫోన్ చేస్తానని బెదిరిస్తూ నైట్ పెట్రోలింగ్ పోలీసులను దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చెన్నైకి చెందిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మెరీనా బీచ్లోని లూప్ రోడ్లో జరిగింది. అక్కడ రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు.. చంద్రమోహన్, ధనలక్ష్మి అనే దంపతులను ప్రశ్నించారు.
Read Also: No Romance in Cab: క్యాబ్లో రొమాన్స్ చేయకండి.. డ్రైవర్ వార్నింగ్
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- 3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
పోలీసులు వారిని విచారించగా తీవ్రంగా స్పందించారు. ఆశ్చర్యమేంటంటే.. దంపతులు పోలీసులపై దుర్భాషలాడారు. దీంతో.. పోలీసులు వారు తిడుతున్న ఘటనను వీడియో తీశారు. ఆ వీడియోలో, ఆ దంపతులు కెమెరాకు పోజులిచ్చి.. పోలీసులను కించపరిచే పేర్లతో బూతులు తిట్టారు. అంతేకాకుండా.. అసభ్య పదజాలంతో దూషించారు. ఒక పోలీసును “బల్లిలా కనిపిస్తున్నారు” అని కూడా దుయ్యబట్టారు. భర్త చంద్రమోహన్ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్తో సంబంధాలు ఉన్నాయంటూ వాదించాడు. “నేను ఉదయనిధి స్టాలిన్ని పిలవనా? నన్ను చూస్తే మీ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ పారిపోతాడు.” మరుసటి రోజే మీ చిరునామాలను ట్రాక్ చేస్తానని బెదిరించాడు, తనను అరెస్టు చేయలేరని చెప్పాడు.
Read Also: Maharashtra: గడ్చిరోలిలో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టు మృతి
వారు అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు పదే పదే చెప్పినప్పటికీ.. చంద్రమోహన్ అధికారులను ఎగతాళి చేస్తూ.. తనను అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు లేదన్నాడు. కాగా.. ఈ దంపతులు చేసిన హంగామా.. అసభ్య పదజాలం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అగౌరవంగా ప్రవర్తించిన దంపతులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వినియోగదారులు డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన అధికారులు.. ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి ఆ దంపతులను కనిపెట్టారు. చంద్రమోహన్, ధనలక్ష్మిలను వెలచ్చేరిలోని ఓ లాడ్జిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మైలాపూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
Hardik Pandya: హార్దిక్ను నట్టేట ముంచేస్తోన్న రోహిత్, సూర్య.. మీకు పాండ్య ఎంత చేశాడో గుర్తుందా బ్రోస్!
-
Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
ట్రెండింగ్
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!