Chandrababu Swearing Ceremony: చంద్రబాబు ప్రమాణస్వీకారం సమయం మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Swearing Ceremony: అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార సమయంలో మార్పులు చేశారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 09:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎంలో ట్వీట్ చేసింది. ప్రమాణ స్వీకారం తేదీ, వేదిక, ముహుర్తాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా సీఎంఓ ప్రకటించింది. గన్నవరం ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు ట్విట్టర్లో సీఎంఓ వెల్లడించింది. తొలుత ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు టీడీపీ తెలిపింది.
“Swearing – In ceremony will be held @ 9.27 AM
on 12th June, 2024 near Kesarapalli IT Park, Gannavaram, Krishna District.”Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 8, 2024
Read Also: CS Neerabh Kumar Prasad: సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సీఎస్ నీరబ్ సమీక్ష
ఇదిలా ఉండగా.. ఏపీ సీఎంఓ ట్విట్టర్ హ్యండ్లర్లో మార్పులు చోటుచేసుకున్నాయి. సీఎంఓ ట్విట్టర్ ప్రొఫైల్లో జగన్ ఫొటో తొలగించి చంద్రబాబు ఫొటోను అధికారులు పెట్టారు. ఇండియాస్ సన్ రైజ్ స్టేట్ అనే నినాదాన్ని సీఎంఓ ట్విట్టర్లో అధికారులు పెట్టారు. 2014-19 మధ్య కాలంలో ఏపీని ఇండియాస్ సన్ రైజ్ స్టేట్గా చంద్రబాబు ప్రమోట్ చేశారు.
ఇదిలా ఉండగా.. ప్రభుత్వం మారడంతో రాజధాని పనుల్లో కదలిక మొదలైంది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే రాజధాని నిర్మాణ పనులకు ఆటంకాల్లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి అమరావతి పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. పనులు నిలిపేయడంతో భారీగా పిచ్చి మొక్కలు పెరిగాయి. మట్టి, కంకర కోసం రోడ్లు సైతం తవ్వుకుపోయిన పరిస్థితులు నెలకొన్నాయి.రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సీఆర్డీయే అధికారులు శుభ్రం చేయిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ల వెంట ఉన్న చెత్తను సీఆర్డీఏ సిబ్బంది తొలగిస్తోంది. రోడ్ల మధ్యలో ఏర్పడిన గుంటలు పూడ్చివేతకు చర్యలు చేపడుతున్నారు. ఐఎఎస్ క్వార్టర్లు, ఎమ్మెల్యే – ఎమ్మెల్సీ క్వార్టర్లు, హైకోర్టు, సెక్రటేరియట్, జడ్జీల బంగ్లాలు, క్రికెట్ స్టేడియం, ఎన్ఐడీ నిర్మాణ ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ చేస్తోంది సీఆర్డీఏ. విట్, ఎస్ఆర్ఎమ్ యూనివర్శిటీల సమీపంలోనూ సీఆర్డీఏ పనులు చేయిస్తోంది.76 జేసీబీలు, ప్రోక్లెయినర్లు, యంత్రాలతో సీఆర్డీయే అధికారులు పనులు చేయిస్తున్నారు. అమరావతిలో నిర్మాణ పనులను సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పరిశీలించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!