Chandrababu: ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు.. వచ్చే ఎన్నికల్లో సత్తా చూపిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: తెలుగు జన విజయకేతన సభ ఇది అని.. తాడేపల్లిగూడెం సభ చరిత్రను తిరగరాస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మన పోరాటం వైసీపీ దొంగలపై అన్న ఆయన.. తాడేపల్లిగూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపిస్తుందన్నారు. మేము చేతులు కలిపింది మా కోసం కాదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసమని.. హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కలసి పోరాటం చేస్తున్నామని చంద్రబాబు టీడీపీ-జనసేన పొత్తు గురించి వ్యాఖ్యానించారు. ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు అని.. మేం చేతులు కలిపింది అధికారం కోసం కాదు, ప్రజల కోసమని.. భవిష్యత్కు నాందీ పలకాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు అన్నారు. ప్రజావేదిక కూల్చి పాలన మొదలు పెట్టారని.. ఇది వైసీపీ నైజమని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు.
Read Also: Andhrapradesh: ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ వీఆర్ఎస్కు ఏపీ సర్కార్ ఆమోదం
Also Read
- Astrology: జూలై 18 శనివారం దినఫలాలు..
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
క్రికెటర్ హనుమ విహారి వైసీపీ వేదింపులు తట్టుకోలేక పారిపోయాడని ఆరోపించారు. రాజకీయ వ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రికి అడ్డువస్తే చంద్రబాబు, పవన్, ప్రజలు ఎవరినీ లెక్కచేయడం లేదని ఆయన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఉండాలని సీఎం కోరుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. ఏమి పొడిచారని వై నాట్ 175 అంటున్నారని.. మేము అడుగుతున్నాం.. వై నాట్ జ్యాబ్ క్యాలండర్, వై నాట్ ఉచిత ఇసుక, వై నాట్ డీఎస్సీ.. జగన్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. జగన్ ది ఫ్లాప్ సినిమా.. దీనికి సీక్వెల్ ఉండదన్నారు. వైసీపీ రౌడీలకి 40రోజుల తర్వాత అసలు సినిమా చూపిస్తామన్నారు. జనసేన, టీడీపీ సూపర్ విన్నింగ్ టీమ్.. వైసీపీ సిట్టింగ్ టీమ్ అంటూ చంద్రబాబు అన్నారు. బాధ్యతగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నాం.. మా అభ్యర్థులను చూశాక వైసీపీలో భయం పట్టుకుందన్నారు. కూటమి అభ్యర్థులను చూసి మళ్ళీ అభ్యర్థులను మార్చుతాం అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. బీసీ, ఎస్సీ డిక్లరేషన్ ఇస్తామన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తామన్నారు. కోరుకున్న అందరికీ సీట్లు ఇవ్వలేమన్న ఆయన.. పని చేసిన నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామన్నారు. ఒక పార్టీ వెనుక మరొక పార్టీ నడవడంలేదు.. రెండు సమానంగా వెళ్తున్నాయన్నారు. నాయకులు ఎవ్వరూ ఈగోలకు పోకూడదన్నారు.పొత్తు సూపర్ హిట్స్.. ఆంధ్రప్రదేశ్ అన్ స్టాపబుల్ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు..
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?