Chandrababu: నేడు 3 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం సభలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రజాగళం పేరుతో.. రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.. రోజుకు రెండు, మూడు సభలు జరిగేలా ప్లాన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.. ఇక, ప్రజాగళంలో భాగంగా ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. బనగానపల్లె, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.. వింజమూరులో రాత్రికి బస చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు..
Read Also: Uttarpradesh : గ్యాంగ్ రేప్ చేశారంటే పట్టించుకోని పోలీసులు.. స్టేషన్లోనే విషం తాగిన బాధితురాలు
Also Read
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నేడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. బనగానపల్లె పెట్రోల్ బంకు కూడలి వద్ద ప్రజాగళం భారీ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రసంగించనున్నారు. బాబు పర్యటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి.. హెలి ప్యాడ్ గ్రౌండ్ ప్రాంగణాన్ని మరియు సమావేశం నిర్వహించనున్న ప్రాంతాన్ని పరిశీలించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నుంచి 10:55 గంటలకు హెలిక్యాప్టర్ లో చంద్రబాబు బయల్దేరి బనగానపల్లె పట్టణ శివారులోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన హేలీ ప్యాడ్ గ్రౌండ్ కు చేరుకోనున్నారు. హెలిప్యాడ్ గ్రౌండ్ నుంచి ప్రత్యేక వాహనంలో పెట్రోల్ బంకు కూడలి బహిరంగ సభ ప్రాంతానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు చైతన్య రథంపై జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 12:40 గంటల కు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నివాసంలో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం వైసీపీని వీడి టీడీపీలో చేరే నాయకులకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానిస్తారు.. 1:45 గంటలకు హెలిపాడ్ వద్దకు చంద్రబాబు చేరుకొని మధ్యాహ్నం 1:50 గంటలకు నెల్లూరు జిల్లా కావాలికి బయల్దేరి వెళ్తారు.. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి ప్రజా గళం సభను విజయ వంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు నిచ్చారు.
తాజావార్తలు
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!