Chandrababu: కొంత మందికి సీట్లు ఇవ్వలేకపోవచ్చు.. కానీ, వాళ్లు త్యాగాన్ని మరువలేను..
Chandrababu: ఈ ఎన్నికల్లో కొంత మంది నేతలకు సీట్లు ఇవ్వలేకపోవచ్చు.. కానీ, వాళ్లు చేసిన త్యాగాన్ని నేను మరువలేను అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రం కోసం.. దేశం కోసం జట్టు కట్టాం. సంప్రదాయ రాజకీయాలు ఉండుంటే మనం కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాళ్లమన్న ఆయన.. ఏపీలో వైసీపీ ఓడిపోకుంటే రాష్ట్రం నాశనం అవుతుందని పవన్ కల్యాణ్ భావించారు. ఓటు చీలకూడదని పవన్ సంకల్పం తీసుకున్నారని తెలిపారు. పొత్తులతో.. పొత్తుల్లేకుండా కూడా పోటీ చేశాం. పొత్తుల వల్ల కొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయాం అన్నారు. మూడు పార్టీల్లోనూ పోరాడిన వాళ్లున్నారు. పొత్తుల వల్ల టీడీపీ కోసం పని చేసిన 31 మంది నేతలకు టిక్కెట్లు ఇవ్వలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పొత్తులతో సంబంధం లేకుండా కొందరి సీనియర్లకు కూడా టిక్కెట్లు ఇవ్వలేకపోయామని.. పెట్టిన అభ్యర్థులు గెలిచేలా బేరీజు వేసుకునే మూడు పార్టీల అభ్యర్థులను నిలబెడుతున్నాం అన్నారు.
పార్టీ పరంగానే కాకుండా సొంతంగా ఓట్లేయించుకునే అభ్యర్థులను ఎంచుకున్నాం అని తెలిపారు చంద్రబాబు.. సోషల్ ఇంజనీరింగ్ చేపట్టాం.. బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చేలా చూశాం. సోషల్ రీ-ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సేవా భావంతో ఉన్న వాళ్లని రాజకీయాల్లో ప్రొత్సహించాల్సిన అవసరం ఉంది అన్నారు. విభిన్న వర్గాల్లో ప్రత్యేకమైన ఆలోచనా ధోరణి ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. వివిధ రంగాల్లో స్థిరపడిన వారికి కూడా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనే ఆలోచనలు కలుగుతున్నాయన్నారు. రాజకీయాలను ఇంకా ప్రక్షాళన చేయగలిగితే.. మరింత మంది మంచి వారు వస్తారు. రాగద్వేషాలకు, రికమెండేషన్లకు అతీతంగా అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఈ మూడు పార్టీల వేసిన పునాది భవిష్యత్తుకు ఊతమిచ్చేలా ఉండాలని ఆకాక్షించారు.
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
వైసీపీ లాంటి పార్టీలను కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలన్నారు చంద్రబాబు నాయుడు.. రూ. 200, రూ. 500 నోట్లను రద్దు చేసే పరిస్థితి రావాలన్న ఆయన.. పెద్ద నోట్ల రద్దు కావాలనేది నా ఆలోచన.. ప్రధాని నరేంద్ర మోడీ అడుగులు కూడా అలాగే పడుతున్నాయని తెలిపారు. ఇక, వైఎస్ జగన్ లాంటి సీఎంను చూడలేదు. జగన్ రాజకీయాన్ని వ్యాపారం చేసేశాడు. జగన్ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలే. తప్పు చేశారని ఎవరైనా అంటే కేసులు పెట్టేస్తారు అంటూ మండిపడ్డారు. ప్రతి ఒక్కటీ ఫేక్. బీజేపీ అధ్యక్షురాలు రాజీనామా చేసేశారని ఫేక్ లెటర్ పెట్టేసి ప్రచారం చేశారు. ఇది తాత్కాలిక పొత్తు అని నా పేరుతో ఫేక్ లెటర్లు వదిలారు. పురంధేశ్వరి నా కుటుంబ సభ్యురాలే కావచ్చు.. కానీ, ఆమె ముప్పై ఏళ్లకు పైగా వేరే పార్టీల్లో ఉన్నారు. ఆమె విషయంలో ఎన్నో తప్పుడు వార్తలు రాశారు. జనసేన మీద.. పవన్ మీద అలాగే తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!