Chandrababu: ఉత్తరాంధ్రంలో 35 సీట్లు గెలిపించాలి.. ఓటర్లను కోరిన టీడీపీ అధినేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాంధ్రలో 35 సీట్లు గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లను కోరారు. రాజాంలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. రాజాం సముద్రాన్ని మించిన జనసంద్రం ఇదని.. ఈ కార్యక్రమానికి జనాలు కమిట్ మెంట్ తో వచ్చారన్నారు. తాగునీటి కోసం ఉత్తరాంధ్రా సుజల స్రవంతి కోసం పోలవరం, వంశదార అనుసంధానం వల్ల తాగు, సాగు నీరు వస్తుందని తెలిపారు. దీనికి 2 వేల కోట్లు ఖర్చు పెట్టామని.. వైసీపీ 5 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. తారకరామతీర్థ సాగర్ కు రూ. 284 కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు. వైసీపీ రూ. 76 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు రూ. 237 కోట్లు ఖర్చు చేస్తే.. ప్రస్తుత అధికార పార్టీ రూ. 64 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ ప్రాంతం బాగుపడాలంటే సాగునీరు అవసరం ఎంతైనా ఉందన్నారు. సలహాలదారులకు రూ. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు.
Read Also: Oman Floods: ఒమన్లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 13 మంది మృతి, పలువురు గల్లంతు
Also Read
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
ఆ డబ్బులు ఇరిగేషన్ కోసం ఖర్చు పెడితే ఉత్తరాంధ్రాకు మంచి జరిగేదన్నారు. వేలాది మంది పెట్టుబడులు రాకతో హైదరాబాద్ ఆర్థికంగా ఎదిగిందన్నారు. భోగాపురం శంకుస్థాపన చేసి భూమి ఇచ్చానని.. ప్రారంభించి ఉంటే అభినందించేవాడినన్నారు. గిరిజన యూనివర్సిసీటీకి 550 ఎకరాలు వెచ్చించి ప్రారంభిస్తే దాని జాడే లేదన్నారు. తాను వేసిన పాన్ల ప్రకారం జరిగుంటే ఈ ప్రాంతం అంతా ఆర్థికంగా ఎదిగేదన్నారు. విశాఖపట్నం గంజాయి రాజధానిగా మారిందన్నారు. కార్పోరేట్ కంపెనీలన్నింటినీ తరిమేశారని ఆరోపించారు. బీసీలకు తాను ఇచ్చిన పథకాలు రద్దు చేశారన్నారు. ఉత్తరాంధ్ర మీద సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పెత్తనం ఏమిటన్నారు. అప్పలనాయుడు ఒక సామాన్య కార్యకర్తను ఎంపీగా ఇస్తున్నానన్నారు. సజ్జల మాటలు ఎలా ఉన్నాయంటే జగన్ మీద గులకరాయి పడితే తెలుగోడి మీద రాయిపడినట్లట.. అసెంబ్లీలో నా భార్యను ఇష్టారాజ్యంగా తిట్టాలేదా అని చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Attack on CM Jagan Incident: కొంత మందిపై అనుమానం ఉంది.. అక్కడి నుంచే రాయి విసిరారు..
తాజావార్తలు
-
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!