Chandrababu: ఉత్తరాంధ్రంలో 35 సీట్లు గెలిపించాలి.. ఓటర్లను కోరిన టీడీపీ అధినేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాంధ్రలో 35 సీట్లు గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లను కోరారు. రాజాంలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. రాజాం సముద్రాన్ని మించిన జనసంద్రం ఇదని.. ఈ కార్యక్రమానికి జనాలు కమిట్ మెంట్ తో వచ్చారన్నారు. తాగునీటి కోసం ఉత్తరాంధ్రా సుజల స్రవంతి కోసం పోలవరం, వంశదార అనుసంధానం వల్ల తాగు, సాగు నీరు వస్తుందని తెలిపారు. దీనికి 2 వేల కోట్లు ఖర్చు పెట్టామని.. వైసీపీ 5 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. తారకరామతీర్థ సాగర్ కు రూ. 284 కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు. వైసీపీ రూ. 76 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు రూ. 237 కోట్లు ఖర్చు చేస్తే.. ప్రస్తుత అధికార పార్టీ రూ. 64 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ ప్రాంతం బాగుపడాలంటే సాగునీరు అవసరం ఎంతైనా ఉందన్నారు. సలహాలదారులకు రూ. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు.
Read Also: Oman Floods: ఒమన్లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 13 మంది మృతి, పలువురు గల్లంతు
Also Read
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
ఆ డబ్బులు ఇరిగేషన్ కోసం ఖర్చు పెడితే ఉత్తరాంధ్రాకు మంచి జరిగేదన్నారు. వేలాది మంది పెట్టుబడులు రాకతో హైదరాబాద్ ఆర్థికంగా ఎదిగిందన్నారు. భోగాపురం శంకుస్థాపన చేసి భూమి ఇచ్చానని.. ప్రారంభించి ఉంటే అభినందించేవాడినన్నారు. గిరిజన యూనివర్సిసీటీకి 550 ఎకరాలు వెచ్చించి ప్రారంభిస్తే దాని జాడే లేదన్నారు. తాను వేసిన పాన్ల ప్రకారం జరిగుంటే ఈ ప్రాంతం అంతా ఆర్థికంగా ఎదిగేదన్నారు. విశాఖపట్నం గంజాయి రాజధానిగా మారిందన్నారు. కార్పోరేట్ కంపెనీలన్నింటినీ తరిమేశారని ఆరోపించారు. బీసీలకు తాను ఇచ్చిన పథకాలు రద్దు చేశారన్నారు. ఉత్తరాంధ్ర మీద సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పెత్తనం ఏమిటన్నారు. అప్పలనాయుడు ఒక సామాన్య కార్యకర్తను ఎంపీగా ఇస్తున్నానన్నారు. సజ్జల మాటలు ఎలా ఉన్నాయంటే జగన్ మీద గులకరాయి పడితే తెలుగోడి మీద రాయిపడినట్లట.. అసెంబ్లీలో నా భార్యను ఇష్టారాజ్యంగా తిట్టాలేదా అని చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Attack on CM Jagan Incident: కొంత మందిపై అనుమానం ఉంది.. అక్కడి నుంచే రాయి విసిరారు..
తాజావార్తలు
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!