Pakistan: ఒక్క గెలుపు లేదు.. పాక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం
- 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా గెలువని పాకిస్తాన్
- పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన పాక్
- జట్టుపై పాకిస్తాన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో.. స్వదేశంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో విజయం సాధించనందుకు ఆ దేశ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈరోజు బంగ్లాతో జరగాల్సిన మ్యాచ్లో గెలిచి పరువు కాపాడుకుందామనుకున్న పాకిస్తాన్కు.. ఈ మ్యాచ్ గెలిచే అదృష్టం లేదు. బంగ్లాదేశ్తో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో పాకిస్తాన్ ఒకటి కూడా గెలవకుండా ఇంటి బాట పట్టింది.
Read Also: Akshay Kumar: “చలో మహాకల్” పాటపై పూజారులు ఆగ్రహం.. అక్షయ్కుమార్ ఏమన్నారంటే?
Also Read
పాకిస్తాన్.. న్యూజిలాండ్, ఇండియా చేతిలో ఓడిపోయి గ్రూప్ Aలో 1.087 నికర రన్ రేట్తో చివరి స్థానంలో నిలిచింది. టోర్నమెంట్ చరిత్రలో అట్టడుగు స్థానంలో నిలిచిన మొదటి ఆతిథ్య దేశంగా పాకిస్తాన్ నిలిచింది. పాకిస్తాన్ జట్టు మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ చేత 60 పరుగుల తేడాతో ఓడింది. రెండవ మ్యాచ్లో భారత్తో.. పాకిస్తాన్ 241 పరుగులకు ఆలౌటై 42.3 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. డ్రాప్ క్యాచ్లు, తక్కువ స్కోరు కారణంగా పాకిస్తాన్ జట్టు విఫలమైంది.
Read Also: ICC: టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ పాకిస్తాన్కు ప్రైజ్ మనీ.. ఎంతంటే..?
ఈ క్రమంలో.. పాకిస్తాన్ జట్టుపై వారి దేశ అభిమానులే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పేస్ బౌలర్లు నసీమ్ షా, షాహీన్ అఫ్రిది, హరిస్ రౌఫ్ అత్యధిక ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించారు. ఖుష్దిల్ షా మాత్రమే రెండు ఇన్నింగ్స్లలో 107 పరుగులు చేసి మంచి మార్కులు పొందాడు. మరోవైపు.. సీనియర్ ఆటగాళ్లు బాబర్ అజామ్, ఫఖర్ జమాన్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!