Champions Trophy 2025: పాక్ మాజీ క్రికెటర్ బెస్ట్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు!
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్
- బెస్ట్ టీమ్ను వెల్లడించిన పాక్ మాజీ క్రికెటర్
- బసిత్ అలీ టీమ్ కెప్టెన్గా రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసిన భారత్.. 12 ఏళ్ల తర్వాత ట్రోఫీని సొంతం చేసుకుంది. ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా రోహిత్ సేన కప్ను దక్కించుకుంది. ఇప్పటికే ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ప్రకటించింది. భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తన బెస్ట్ టీమ్ను వెల్లడించాడు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కూడా తన ప్లేయింగ్ 11ను ప్రకటించాడు. బసిత్ తన జట్టులో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు ఇచ్చాడు.
‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్లో మ్యాచ్లను చూశాం. ప్లేయర్స్ గడాఫీ స్టేడియంలోనూ మంచి ప్రదర్శనలు చేశారు. 11 మందితో కూడిన జట్టును ఎంపిక ఎంచుకున్నా. టోర్నీలో బాగా ఆడిన ఆటగాళ్లతో జట్టును ప్రకటిస్తున్నా. ఐసీసీ జట్టును నేను సరిపోల్చడం లేదు. నా టీమ్ కెప్టెన్గా రోహిత్ శర్మ. టోర్నీ ఆసాంతం కెప్టెన్గా రాణించాడు. ఫైనల్లో హాఫ్ సెంచరీతో మ్యాచ్ గతినే మార్చేశాడు. మరో ఓపెనర్గా రెండు సెంచరీలు చేసిన రచిన్ రవీంద్రను ఎంచుకున్నా. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఆడాల్సిందే. మ్యాచ్ పరిస్థితిని అంచనా వేయడంలో అతడు దిట్ట. భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్ను నాలుగో స్థానంలో ఆడిస్తా. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ ఉంటాడు’ బసిత్ అలీ తెలిపాడు.
Also Read
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
‘ఆరో స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ ఆడతారు. ఫిలిప్స్ అద్భుతమైన బౌలర్, ప్రమాదకరమైన ఫీల్డర్. ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ను ఏడో స్థానంలో ఆడిస్తా. నా జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు చోటిచ్చాను. వరుణ్ చక్రవర్తి, మిచెల్ శాంట్నర్కు అవకాశం ఇచ్చాను. అక్షర్ పటేల్ రేసులో ఉన్నా.. శాంట్నర్ను ఎంచుకున్నా. మహమ్మద్ షమీ, మ్యాట్ హెన్రీలు ఫాస్ట్ బౌలర్లుగా ఆడుతారు’ అని బసిత్ అలీ తన జట్టును ప్రకటించాడు.
Also Read: Chiranjeevi-Anil Ravipudi: చిరంజీవి-అనిల్ ‘మెగా’ స్పీడ్.. త్వరలోనే సెకండ్ హాఫ్?
బసిత్ అలీ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, గ్లెన్ ఫిలిప్స్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మిచెల్ శాంట్నర్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ, మ్యాట్ హెన్రీ.
తాజావార్తలు
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!