Bandru Sobharani: కేటీఆర్ పై మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ ఘాటు వ్యాఖ్యలు!
- కేటీఆర్ పై మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బండ్రు శోభారాణి ఘాటు వ్యాఖ్యలు
- పబ్బులు తిరిగే లోపర్ నా కొడుకు
- చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు
- అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే విగ్రహాల రాజకీయం చేస్తున్నారని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్ పై మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బండ్రు శోభారాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆమె మాట్లాడుతూ.. “పబ్బులు తిరిగే లోపర్ నా కొడుకు.. చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే విగ్రహాల రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలో తెలియలేదా. తెలంగాణ తల్లి హుందాతనం తీసుకొచ్చి మరింత గౌరవం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు. కొంత మంది మేధావుల పేరుతో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ముడుపుల కోసం కొంత మంది మేధావులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు.” అని ఫైర్ అయ్యారు.
READ MORE: Atchutapuram Sez: కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్.. 18 మందికి పైగా తీవ్రగాయాలు
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
కాగా.. రాష్ట్ర రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై అధికార, ప్రతిపక్షాలు ప్రచ్ఛన్న యుద్ధానికి దిగాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సచివాలయానికి ఓ వైపు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, ఎదురుగా అమలవీరుల స్మారక స్థూపం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం స్థలాన్ని కూడా కేటాయించింది. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఏర్పాట్లు కూడా పూర్తి విగ్రహావిష్కరణకు చీఫ్ గెస్ట్ గా రాహుల్ గాంధీని ఆహ్వానించింది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారంటూ బీఆర్ఎస్ నేతలు ఫైరయ్యారు. ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విగ్రహాన్ని తొలగిస్తామని, దీంతో పాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేర్లను కూడా మారుస్తా మన్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!