Windfall Tax : ముడి చమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ను పెంచిన కేంద్రప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Windfall Tax : ముడిచమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ ను కేంద్ర ప్రభుత్వం శనివారం పెంచింది. ఇప్పుడు ముడి చమురుపై టన్నుకు రూ.3,200 చొప్పున విండ్ ఫాల్ ట్యాక్స్ విధించనున్నారు. కొత్త రేట్లు ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతకుముందు క్రూడాయిల్పై టన్నుకు రూ.1,700 విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నారు. డీజిల్, పెట్రోల్, విమాన ఇంధనాల విషయంలో ప్రభుత్వం విండ్ఫాల్ ట్యాక్స్లో ఎలాంటి మార్పు చేయలేదు. డీజిల్, పెట్రోల్, ఏటీఎఫ్ పై విండ్ ఫాల్ పన్ను రేట్లు సున్నా. నెక్ట్స్ అప్ డేట్ వరకు వాటిపై విండ్ఫాల్ పన్ను సున్నాగానే ఉంటుంది.
Read Also:Karthi : తెలుగు హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్న కార్తీ..
Also Read
విండ్ ఫాల్ టాక్స్ అంటే ఏమిటి?
విండ్ ఫాల్ టాక్స్ అనేది ఒక రకమైన అదనపు కస్టమ్ డ్యూటీ. దీని ద్వారా క్రూడాయిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారం ద్వారా భారీ లాభాలు ఆర్జిస్తున్న కంపెనీల నుంచి ప్రభుత్వం కొంత భాగాన్ని ట్రెజరీలో జమ చేస్తుంది. గత ఏడాదిన్నర కాలంలో ప్రపంచ ఇంధన వాణిజ్యంలో వచ్చిన ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని, చాలా దేశాలు ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులపై విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నాయి. భారతదేశంలో ప్రభుత్వం జూలై 2022లో ముడి చమురుపై విండ్ఫాల్ పన్ను విధించింది. ముడి చమురు ఉత్పత్తిదారులతో పాటు, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనాల ఎగుమతులపై కూడా ప్రభుత్వం విండ్ఫాల్ పన్ను విధించింది. ప్రభుత్వం ప్రతి రెండు వారాలకు విండ్ ఫాల్ పన్నును సమీక్షిస్తుంది. అంతకుముందు, జనవరి 16 న చేసిన మార్పులలో, ముడి చమురుపై విండ్ఫాల్ పన్ను రేట్లు తగ్గించబడ్డాయి. అప్పుడు ప్రభుత్వం టన్నుకు రూ.1,700కు తగ్గించింది. అయితే డీజిల్, పెట్రోల్, ATF పై జీరో విండ్ ఫాల్ ట్యాక్స్ ఉంచబడింది.
Read Also:Kajal Aggarwal: కాటుక కళ్ళతో మాయచేస్తున్న కాజల్ అగర్వాల్…
ఫిబ్రవరి 2022లో తూర్పు ఐరోపాలో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇంధన మార్కెట్ సమతుల్యత దెబ్బతింది. అమెరికా, దాని అనుబంధ దేశాలు రష్యాపై అనేక ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఇందులో ఇంధనం అంటే ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలుపై కూడా పరిమితులు ఉన్నాయి. దీని వల్ల భారత్ వంటి దేశాల్లోని కంపెనీలు లాభపడ్డాయి. ఆర్థిక పరిమితుల కారణంగా.. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా యూరప్లో గణనీయంగా పెరిగాయి. ఎక్కువ లాభాలను సంపాదించడానికి.. అనేక భారతీయ కంపెనీలు దేశీయ మార్కెట్కు బదులుగా ముడి చమురు, డీజిల్, పెట్రోల్, ఏటీఎఫ్ మొదలైన వాటిని ఎగుమతి చేయడం ప్రారంభించాయి.
తాజావార్తలు
-
US Iran Sanctions: ఇరాన్తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!