Windfall Tax : ముడి చమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ను పెంచిన కేంద్రప్రభుత్వం
Windfall Tax : ముడిచమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ ను కేంద్ర ప్రభుత్వం శనివారం పెంచింది. ఇప్పుడు ముడి చమురుపై టన్నుకు రూ.3,200 చొప్పున విండ్ ఫాల్ ట్యాక్స్ విధించనున్నారు. కొత్త రేట్లు ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతకుముందు క్రూడాయిల్పై టన్నుకు రూ.1,700 విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నారు. డీజిల్, పెట్రోల్, విమాన ఇంధనాల విషయంలో ప్రభుత్వం విండ్ఫాల్ ట్యాక్స్లో ఎలాంటి మార్పు చేయలేదు. డీజిల్, పెట్రోల్, ఏటీఎఫ్ పై విండ్ ఫాల్ పన్ను రేట్లు సున్నా. నెక్ట్స్ అప్ డేట్ వరకు వాటిపై విండ్ఫాల్ పన్ను సున్నాగానే ఉంటుంది.
Read Also:Karthi : తెలుగు హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్న కార్తీ..
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
విండ్ ఫాల్ టాక్స్ అంటే ఏమిటి?
విండ్ ఫాల్ టాక్స్ అనేది ఒక రకమైన అదనపు కస్టమ్ డ్యూటీ. దీని ద్వారా క్రూడాయిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారం ద్వారా భారీ లాభాలు ఆర్జిస్తున్న కంపెనీల నుంచి ప్రభుత్వం కొంత భాగాన్ని ట్రెజరీలో జమ చేస్తుంది. గత ఏడాదిన్నర కాలంలో ప్రపంచ ఇంధన వాణిజ్యంలో వచ్చిన ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని, చాలా దేశాలు ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులపై విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నాయి. భారతదేశంలో ప్రభుత్వం జూలై 2022లో ముడి చమురుపై విండ్ఫాల్ పన్ను విధించింది. ముడి చమురు ఉత్పత్తిదారులతో పాటు, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనాల ఎగుమతులపై కూడా ప్రభుత్వం విండ్ఫాల్ పన్ను విధించింది. ప్రభుత్వం ప్రతి రెండు వారాలకు విండ్ ఫాల్ పన్నును సమీక్షిస్తుంది. అంతకుముందు, జనవరి 16 న చేసిన మార్పులలో, ముడి చమురుపై విండ్ఫాల్ పన్ను రేట్లు తగ్గించబడ్డాయి. అప్పుడు ప్రభుత్వం టన్నుకు రూ.1,700కు తగ్గించింది. అయితే డీజిల్, పెట్రోల్, ATF పై జీరో విండ్ ఫాల్ ట్యాక్స్ ఉంచబడింది.
Read Also:Kajal Aggarwal: కాటుక కళ్ళతో మాయచేస్తున్న కాజల్ అగర్వాల్…
ఫిబ్రవరి 2022లో తూర్పు ఐరోపాలో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇంధన మార్కెట్ సమతుల్యత దెబ్బతింది. అమెరికా, దాని అనుబంధ దేశాలు రష్యాపై అనేక ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఇందులో ఇంధనం అంటే ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలుపై కూడా పరిమితులు ఉన్నాయి. దీని వల్ల భారత్ వంటి దేశాల్లోని కంపెనీలు లాభపడ్డాయి. ఆర్థిక పరిమితుల కారణంగా.. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా యూరప్లో గణనీయంగా పెరిగాయి. ఎక్కువ లాభాలను సంపాదించడానికి.. అనేక భారతీయ కంపెనీలు దేశీయ మార్కెట్కు బదులుగా ముడి చమురు, డీజిల్, పెట్రోల్, ఏటీఎఫ్ మొదలైన వాటిని ఎగుమతి చేయడం ప్రారంభించాయి.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!