Windfall Tax : ముడి చమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ను పెంచిన కేంద్రప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Windfall Tax : ముడిచమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ ను కేంద్ర ప్రభుత్వం శనివారం పెంచింది. ఇప్పుడు ముడి చమురుపై టన్నుకు రూ.3,200 చొప్పున విండ్ ఫాల్ ట్యాక్స్ విధించనున్నారు. కొత్త రేట్లు ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతకుముందు క్రూడాయిల్పై టన్నుకు రూ.1,700 విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నారు. డీజిల్, పెట్రోల్, విమాన ఇంధనాల విషయంలో ప్రభుత్వం విండ్ఫాల్ ట్యాక్స్లో ఎలాంటి మార్పు చేయలేదు. డీజిల్, పెట్రోల్, ఏటీఎఫ్ పై విండ్ ఫాల్ పన్ను రేట్లు సున్నా. నెక్ట్స్ అప్ డేట్ వరకు వాటిపై విండ్ఫాల్ పన్ను సున్నాగానే ఉంటుంది.
Read Also:Karthi : తెలుగు హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్న కార్తీ..
Also Read
- Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్పై తీవ్ర ఆరోపణలు..
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
విండ్ ఫాల్ టాక్స్ అంటే ఏమిటి?
విండ్ ఫాల్ టాక్స్ అనేది ఒక రకమైన అదనపు కస్టమ్ డ్యూటీ. దీని ద్వారా క్రూడాయిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారం ద్వారా భారీ లాభాలు ఆర్జిస్తున్న కంపెనీల నుంచి ప్రభుత్వం కొంత భాగాన్ని ట్రెజరీలో జమ చేస్తుంది. గత ఏడాదిన్నర కాలంలో ప్రపంచ ఇంధన వాణిజ్యంలో వచ్చిన ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని, చాలా దేశాలు ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులపై విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నాయి. భారతదేశంలో ప్రభుత్వం జూలై 2022లో ముడి చమురుపై విండ్ఫాల్ పన్ను విధించింది. ముడి చమురు ఉత్పత్తిదారులతో పాటు, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనాల ఎగుమతులపై కూడా ప్రభుత్వం విండ్ఫాల్ పన్ను విధించింది. ప్రభుత్వం ప్రతి రెండు వారాలకు విండ్ ఫాల్ పన్నును సమీక్షిస్తుంది. అంతకుముందు, జనవరి 16 న చేసిన మార్పులలో, ముడి చమురుపై విండ్ఫాల్ పన్ను రేట్లు తగ్గించబడ్డాయి. అప్పుడు ప్రభుత్వం టన్నుకు రూ.1,700కు తగ్గించింది. అయితే డీజిల్, పెట్రోల్, ATF పై జీరో విండ్ ఫాల్ ట్యాక్స్ ఉంచబడింది.
Read Also:Kajal Aggarwal: కాటుక కళ్ళతో మాయచేస్తున్న కాజల్ అగర్వాల్…
ఫిబ్రవరి 2022లో తూర్పు ఐరోపాలో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇంధన మార్కెట్ సమతుల్యత దెబ్బతింది. అమెరికా, దాని అనుబంధ దేశాలు రష్యాపై అనేక ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఇందులో ఇంధనం అంటే ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలుపై కూడా పరిమితులు ఉన్నాయి. దీని వల్ల భారత్ వంటి దేశాల్లోని కంపెనీలు లాభపడ్డాయి. ఆర్థిక పరిమితుల కారణంగా.. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా యూరప్లో గణనీయంగా పెరిగాయి. ఎక్కువ లాభాలను సంపాదించడానికి.. అనేక భారతీయ కంపెనీలు దేశీయ మార్కెట్కు బదులుగా ముడి చమురు, డీజిల్, పెట్రోల్, ఏటీఎఫ్ మొదలైన వాటిని ఎగుమతి చేయడం ప్రారంభించాయి.
తాజావార్తలు
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
-
Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!