Pawan Kalyan: రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు
- రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు
- తొలి విడతగా రూ.15.4 కోట్లు మంజూరు
- వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఆమోదం తెలియజేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగర వనాలు అభివృద్ధి నిమిత్తం తొలి విడతగా రూ.15.4 కోట్లను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధులతో కర్నూలులో గార్గేయపురం నగర వనం, కడప నగర వనం, నెల్లిమర్లలో వెలగాడ నగర వనం, చిత్తూరు డెయిరీ నగర వనం, చిత్తూరులో కలిగిరి కొండ నగర వనం, శ్రీకాళహస్తిలో కైలాసగిరి నగర వనం, తాడేపల్లిగూడెంలో ప్రకాశరావుపాలెం నగర వనం, పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయ కోట ఎకో పార్క్ నగర వనం, కదిరిలో బత్రేపల్లి వాటర్ ఫాల్స్ ఎకో పార్క్ నగరవనం, పలాసలో కాశీబుగ్గ నగర వనం, విశాఖపట్నంలో ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్ నగర వనాలను అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
Read Also: Andhra Pradesh: బదిలీలకు గైడ్ లైన్స్ జారీ చేస్తున్న వివిధ శాఖలు
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ఈ సందర్భంగా రాష్ట్రంలో అటవీ శాఖ అధికారులతో చర్చించారు. నగర వనాలకు సంబంధించిన పనులపై ప్రస్తుతం రాష్ట్రంలో 50 నగర వనాల అభివృద్ధి వేగంగా పనులు సాగుతున్నాయనీ, రాబోయే 100 రోజుల్లో 30 నగర వనాల పనులు పూర్తి కావస్తాయని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే అవకాశాలు లభించాయని పవన్కల్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం 50శాతం మేరకు ఉండాలని, ఇందులో భాగంగా నగర వనాలు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు.
30వ తేదీన వన మహోత్సవం
ఈ నెల 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని, ఇందులో ప్రజలు, ముఖ్యంగా యువత భాగస్వామ్యాన్ని పెంచాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక వేడుకలా చేయాలని, ప్రభుత్వ శాఖలతోపాటు అన్ని విద్యా సంస్థలు, విశ్వ విద్యాలయాలు, పరిశ్రమలు, పేపర్ మిల్లులు, అధ్యాత్మిక సంస్థలు.. అన్నింటినీ ఇందులో పాలుపంచుకొనేలా చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!