Yoga Break: సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇకపై ‘యోగా బ్రేక్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు ఇక నుంచి యోగా బ్రేక్ తీసుకోవాలని మోడీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తమ బిజీ షెడ్యూల్ కారణంగా యోగా చేయలేని వారు, కార్యాలయాల్లోని తమ కుర్చీల్లో కూర్చొని యోగా చేయొచ్చని వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆఫీసుల్లో భోజన విరామం, టీ, టిఫిన్ కోసం బ్రేక్లు ఉండేవి.. కానీ.. కొత్తగా కేంద్ర ప్రభుత్వం యోగా బ్రేక్ ను కూడా తీసుకురావటంతో ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని శాఖల్లోని ఉద్యోగులు ఈ యోగా బ్రేక్ ను తప్పకుండా వాడుకోవాలని సిబ్బంది శిక్షణ, వ్యవహారాల మంత్రిత్వ శాఖ జీవోను జారీ చేసింది.
Also Read : Amit Sha Tour: నేడే హైదరాబాద్ కు అమిత్ షా.. దర్శక ధీరుడు రాజమౌళితో భేటీ..!
Also Read
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
పని చేసే ప్రదేశంలో ఒత్తిడిని తగ్గించుకుని పునరుత్తేజం పొందేందుకు వీలుగా ఆఫీసు సమయంలో కుర్చీలోనే యోగా చేయాలని పేర్కొనింది. నిత్యం ఆఫీస్ పనుల్లో ఒత్తిడి, ఇంటి వద్ద యోగా చేయలేని ఉరుకుల పరుగుల జీవితం.. ఫలితంగా కొందరు ఉద్యోగులు మానసిక ఇబ్బందులు పడుతుంటారు. వీటి నుంచి కొంత ఉపశమనం పొందేందుకు, పనివేళల్లో ఒత్తిడి తగ్గించుకొని పునరుత్తేజం పొందేందుకు ఆఫీసుల్లోని కుర్చీలో యోగా చేసుకునేందుకు ఛాన్స్ కల్పిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది శిక్షణ, వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించారు.
Also Read : Wednesday Stotra: ఈ స్తోత్రాలు వింటే ఆర్థిక ఇబ్బందులు, శారీరక, మానసికలు దూరమవుతాయి
అయితే, కుర్చీల్లో కూర్చొని ఎలాంటి ఆసనాలు వేయాలనే అనుమానం కొందరు ఉద్యోగులకు రావొచ్చు.. అలాంటి వారికోసం, కార్యాలయాల్లో ఎలాంటి ఆసనాలు వేసేందుకు వీలుందో తెలిపే యూట్యూబ్ వీడియోల లింక్లను మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది. సిబ్బంది శిక్షణ , వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన యూట్యూబ్ లింక్ లో ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానానికి సంబంధించిన విదివిధానాలు ఉంటాయని తెలిపింది. వీటిని నిపుణుల సూచనలతో రూపొందించినట్లు సూచించింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ, ఆయుష్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి. అన్ని ప్రభుత్వ శాఖలు వై-బ్రేక్ గురించి ఉద్యోగుల్లో అవగాహన కల్పించాలని కేంద్రం ఉత్తర్వుల్లో తెలిపింది.
తాజావార్తలు
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
Potti Sriramulu’s Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
-
Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!