Panthangi Toll plaza: కేంద్రబలగాల అధీనంలో పంతంగి టోల్ ప్లాజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజాను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి కేంద్ర బలగాలు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నాటి నుండి టోల్ ప్లాజా వద్ద తెలంగాణ ప్రభుత్వం చెక్ పోస్ట్ లు పెట్టి వాహనాలను తనిఖీలు నిర్వహిస్తోంది. దీంతో పాటు జాతీయ రహదారిపై వున్న పలు చెక్ పోస్ట్ ల వద్ద డబ్బులు కట్టలు కట్టలు దొరుకుతున్నాయి. దీంతో కేంద్ర బలగాలు కూడా ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి పంతంగి టోల్ ప్లాజా ను తమ అధీనంలోకి తీసుకొని ప్రతి వాహనాన్ని తనిఖీలు నిర్వహిస్తున్నాయి కేంద్ర బలగాలు.
ఈ ఉప ఎన్నికను అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. దీంతో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. రెండురోజుల క్రితం కోటి రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. మునుగోడు(Munugode)లో ఎలాగైనా గెలవాలని చూస్తున్న పార్టీలు ఇతర ప్రాంతాలనుంచి నగదును తరలిస్తున్నాయి. కారులో తరలిస్తున్న నగదు కట్టలు పోలీసుల తనిఖీలో బయటపడ్డాయి. ఇవి మునుగోడు ఉప ఎన్నిక కోసం తీసుకొస్తున్న బీజేపీ(BJP)కి చెందిన కోటి రూపాయలుగా చెబుతున్నారు. మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు చేస్తుండగా ఈ నగదు పట్టుబడింది.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
Read Also: State Bank Of India: నిరుద్యోగులకు శుభవార్త.. 1,422 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఇదే కాకుండా హైదరాబాద్ లో ఎక్కడో చోట హవాలా మనీ చిక్కుతోంది. జూబ్లీహిల్స్ లో 54 లక్షలు, మరోచోట 2.5కోట్ల రూపాయల హవాలా డబ్బు పోలీసులకు చిక్కింది. బంజారాహిల్స్లో రూ.2 కోట్లు, చాంద్రాయణగుట్టలో రూ. 79 లక్షలు, జూబ్లీహిల్స్లో రూ. 2 కోట్లు ఇలా పట్టుబడుతూనే ఉంది. దీనిపై అధికారులు సైతం సీరియస్ గా తీసుకుంటున్నారు. పది రోజుల వ్యవధిలోనే సుమారు 10 కోట్లకు పైగానే డబ్బు పట్టుబడిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు ఓటర్లకు డిజిటల్ రూపంలో డబ్బుల పంపిణీ జరుగుతోందని సమాచారం. డబ్బులు ఇస్తే తెలిసిపోతుందని వివిధ బహుమతుల రూపంలో ఓటర్లకు తాయిలాలు అందుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్న మునుగోడు ఓటర్ల కోసం ఎంత ఖర్చుపెటడానికైనా పార్టీలు వెనుకాడడం లేదు. ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసి మరీ వారిని తమ తమ స్వగ్రామాలకు తరలిస్తున్నాయి పార్టీలు.
Read Also: Snake on Plane: విమానంలో పాము.. ఆందోళనకు గురైన ప్రయాణికులు..
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?