Panthangi Toll plaza: కేంద్రబలగాల అధీనంలో పంతంగి టోల్ ప్లాజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజాను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి కేంద్ర బలగాలు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నాటి నుండి టోల్ ప్లాజా వద్ద తెలంగాణ ప్రభుత్వం చెక్ పోస్ట్ లు పెట్టి వాహనాలను తనిఖీలు నిర్వహిస్తోంది. దీంతో పాటు జాతీయ రహదారిపై వున్న పలు చెక్ పోస్ట్ ల వద్ద డబ్బులు కట్టలు కట్టలు దొరుకుతున్నాయి. దీంతో కేంద్ర బలగాలు కూడా ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి పంతంగి టోల్ ప్లాజా ను తమ అధీనంలోకి తీసుకొని ప్రతి వాహనాన్ని తనిఖీలు నిర్వహిస్తున్నాయి కేంద్ర బలగాలు.
ఈ ఉప ఎన్నికను అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. దీంతో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. రెండురోజుల క్రితం కోటి రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. మునుగోడు(Munugode)లో ఎలాగైనా గెలవాలని చూస్తున్న పార్టీలు ఇతర ప్రాంతాలనుంచి నగదును తరలిస్తున్నాయి. కారులో తరలిస్తున్న నగదు కట్టలు పోలీసుల తనిఖీలో బయటపడ్డాయి. ఇవి మునుగోడు ఉప ఎన్నిక కోసం తీసుకొస్తున్న బీజేపీ(BJP)కి చెందిన కోటి రూపాయలుగా చెబుతున్నారు. మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు చేస్తుండగా ఈ నగదు పట్టుబడింది.
Also Read
- NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
- Explained: రెండూ మెసేజింగ్ యాప్లే కానీ.. వాట్సాప్ను వదిలేసి టెలిగ్రామ్నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
- Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
- Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
Read Also: State Bank Of India: నిరుద్యోగులకు శుభవార్త.. 1,422 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఇదే కాకుండా హైదరాబాద్ లో ఎక్కడో చోట హవాలా మనీ చిక్కుతోంది. జూబ్లీహిల్స్ లో 54 లక్షలు, మరోచోట 2.5కోట్ల రూపాయల హవాలా డబ్బు పోలీసులకు చిక్కింది. బంజారాహిల్స్లో రూ.2 కోట్లు, చాంద్రాయణగుట్టలో రూ. 79 లక్షలు, జూబ్లీహిల్స్లో రూ. 2 కోట్లు ఇలా పట్టుబడుతూనే ఉంది. దీనిపై అధికారులు సైతం సీరియస్ గా తీసుకుంటున్నారు. పది రోజుల వ్యవధిలోనే సుమారు 10 కోట్లకు పైగానే డబ్బు పట్టుబడిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు ఓటర్లకు డిజిటల్ రూపంలో డబ్బుల పంపిణీ జరుగుతోందని సమాచారం. డబ్బులు ఇస్తే తెలిసిపోతుందని వివిధ బహుమతుల రూపంలో ఓటర్లకు తాయిలాలు అందుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్న మునుగోడు ఓటర్ల కోసం ఎంత ఖర్చుపెటడానికైనా పార్టీలు వెనుకాడడం లేదు. ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసి మరీ వారిని తమ తమ స్వగ్రామాలకు తరలిస్తున్నాయి పార్టీలు.
Read Also: Snake on Plane: విమానంలో పాము.. ఆందోళనకు గురైన ప్రయాణికులు..
తాజావార్తలు
-
NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
-
Sanchita Ugale : సంచితా ఉగలే ఆత్మహత్యతో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుకు సంబంధం ఉందా?
-
Explained: రెండూ మెసేజింగ్ యాప్లే కానీ.. వాట్సాప్ను వదిలేసి టెలిగ్రామ్నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
-
Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?