Ashwini Vaishnav: సిమ్ కార్డ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్.. టార్గెట్ అదే..!
ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్న విషయం తెలిసిందే.. ఫేక్ ఐడీలతో మోసగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పటినుంచి సిమ్ కార్డ్ డీలర్లకు పోలీసుల వెరిఫికేషన్ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ గురువారం వెల్లడించారు. మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి బల్క్ కనెక్షన్ల సదుపాయాన్ని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాలు, మోసపూరిత ఫోన్ కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా.. బల్క్ సిమ్ కార్డు కనెక్షన్లు ఇవ్వడంపై కూడా ఆంక్షలు విధించింది.
New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి
Also Read
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- Freezer Ice Smell Solution: ఫ్రీజర్లోని ఐస్ నుంచి దుర్వాసన వస్తుందా..? 2 నిమిషాల్లో తొలగించే సులభమైన చిట్కాలు..!
- Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
ప్రస్తుతం కొంతమంది సిమ్ డీలర్లు వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా సిమ్ కార్డులను విక్రయిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఇకపై అలా జరగకుండా.. సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మరోవైపు వెరిఫికేషన్ తర్వాత వారు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని.. అలా చేయని ఎడలా వారికి రూ.10 లక్షల జరిమానా విధిస్తామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల సిమ్ డీలర్లు ఉన్నారని.. వారు వెరిఫికేషన్ పూర్తి చేయాలని అందుకోసం తగిన సమయం ఇస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.
Ghulam Nabi Azad: హిందూ-ముస్లింలపై గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇకపై.. బల్క్ కనెక్షన్ల నిబంధనను తొలగించి, కొత్త విధానం(బిజినెస్ కనెక్షన్లు) పేరుతో అందుబాటులోకి తెస్తున్నట్లు అశ్విన్ వైష్ణవ్ చెప్పారు. ఆ విధానంలో వ్యక్తిగత కేవైసీ తప్పనిసరి అన్నారు. బిజినెస్లకు కేవైసీ సహా, సిమ్ కార్డులు విక్రయించే వారి కేవైసీ కూడా తప్పనిసరిగా ఉంటుందని వివరించారు. ఇటీవలే.. 52 లక్షల మొబైల్ కనెక్షన్లను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. అంతేకాకుండా 67వేల మంది డీలర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టామని.. 2023 మే నుండి సిమ్ కార్డ్ డీలర్లపై 300 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. 66వేలకు పైగా మోసపూరిత వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు తెలిపారు. ఇందుకు కారణం మోసపూరిత లావాదేవీలేనని అన్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టే కేంద్రం కొత్త రూల్స్ తో మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు.
తాజావార్తలు
-
Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
-
Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
-
Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
-
Freezer Ice Smell Solution: ఫ్రీజర్లోని ఐస్ నుంచి దుర్వాసన వస్తుందా..? 2 నిమిషాల్లో తొలగించే సులభమైన చిట్కాలు..!
-
Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?