Ashwini Vaishnav: సిమ్ కార్డ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్.. టార్గెట్ అదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్న విషయం తెలిసిందే.. ఫేక్ ఐడీలతో మోసగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పటినుంచి సిమ్ కార్డ్ డీలర్లకు పోలీసుల వెరిఫికేషన్ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ గురువారం వెల్లడించారు. మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి బల్క్ కనెక్షన్ల సదుపాయాన్ని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాలు, మోసపూరిత ఫోన్ కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా.. బల్క్ సిమ్ కార్డు కనెక్షన్లు ఇవ్వడంపై కూడా ఆంక్షలు విధించింది.
New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి
Also Read
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
ప్రస్తుతం కొంతమంది సిమ్ డీలర్లు వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా సిమ్ కార్డులను విక్రయిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఇకపై అలా జరగకుండా.. సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మరోవైపు వెరిఫికేషన్ తర్వాత వారు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని.. అలా చేయని ఎడలా వారికి రూ.10 లక్షల జరిమానా విధిస్తామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల సిమ్ డీలర్లు ఉన్నారని.. వారు వెరిఫికేషన్ పూర్తి చేయాలని అందుకోసం తగిన సమయం ఇస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.
Ghulam Nabi Azad: హిందూ-ముస్లింలపై గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇకపై.. బల్క్ కనెక్షన్ల నిబంధనను తొలగించి, కొత్త విధానం(బిజినెస్ కనెక్షన్లు) పేరుతో అందుబాటులోకి తెస్తున్నట్లు అశ్విన్ వైష్ణవ్ చెప్పారు. ఆ విధానంలో వ్యక్తిగత కేవైసీ తప్పనిసరి అన్నారు. బిజినెస్లకు కేవైసీ సహా, సిమ్ కార్డులు విక్రయించే వారి కేవైసీ కూడా తప్పనిసరిగా ఉంటుందని వివరించారు. ఇటీవలే.. 52 లక్షల మొబైల్ కనెక్షన్లను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. అంతేకాకుండా 67వేల మంది డీలర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టామని.. 2023 మే నుండి సిమ్ కార్డ్ డీలర్లపై 300 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. 66వేలకు పైగా మోసపూరిత వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు తెలిపారు. ఇందుకు కారణం మోసపూరిత లావాదేవీలేనని అన్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టే కేంద్రం కొత్త రూల్స్ తో మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు.
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్కు అరుదైన గౌరవం
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!