Election Commission: అక్టోబరు 3న తెలంగాణకు ఎలక్షన్ కమిషన్ రాక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) బృందం అక్టోబర్ 3 నుంచి హైదరాబాద్లో పర్యటించనుంది. ఈ క్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Asian Games 2023: షాట్పుట్లో కిరణ్ బలియన్కు కాంస్యం
Also Read
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
- Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
- Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
ఇక, ఎన్నికల సంఘం పర్యటన నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి.. సచివాలయంలో నేడు (శుక్రవారం) అధికారులో సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి సన్నద్ధతను ఎలక్షన్ కమిషన్ కు వివరించాలని ఆమె చెప్పారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగనున్నందున పోలింగ్కు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ సూచించారు. అన్ని వివరాలను అందించాలని క్లారిటీ ఇచ్చారు.
Read Also: Rajinikanth: చంద్రముఖి 2.. ఏ యాంగిల్ లో నచ్చింది తలైవా నీకు.. ?
అయితే, అదే విధంగా పోలింగ్ కేంద్రాల్లో కల్పించనున్న కనీస వసతుల వివరాలు ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి చెప్పారు. వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో చర్చించి వీల్ ఛైర్లను సమకూర్చుకొని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలి అని ఆమె అన్నారు. ఏఈఆర్ఓ, ఈఆర్ఓ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు తెలిపింది. సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వివరాలను ఎలక్షన్ కమిషన్ కు అందించాలని అధికారులను ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అదేశించారు.
తాజావార్తలు
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
-
Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
-
Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
-
CP VC Sajjanar : బైక్పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్వేపై సడన్ చెక్.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!