Asian Games 2023: ఆసియా క్రీడలలో భారత్ జోరు కొనసాగుతుంది. తాజాగా ఇండియా మరో పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల షాట్పుట్ ఈవెంట్లో కిరణ్ బలియన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో భారత్కు ఇది 33వ పతకం. కిరణ్ తన మూడో ప్రయత్నంలో 17.36 మీటర్లు విసిరి ఈ పతకాన్ని గెలుచుకుంది. ఇదిలా ఉంటే షాట్పుట్ ఈవెంట్లో చైనా క్రీడాకారులు బంగారు, రజత పతకాలు సాధించారు.
Read Also: Rajinikanth: చంద్రముఖి 2.. ఏ యాంగిల్ లో నచ్చింది తలైవా నీకు.. ?
కిరణ్ బలియన్ మీరట్ కు చెందిన క్రీడాకారిణి.. ఆమె ఆసియా క్రీడలు 2023లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో భారతదేశానికి పతక ఖాతా తెరిచింది. దీంతో భారత్ ఖాతాలో 8 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యాలతో సహా 19వ ఆసియా క్రీడల్లో పతకాల సంఖ్య 33కి చేరుకుంది.
Read Also: Seediri Appalaraju: 6 నెలల్లో కురుక్షేత్రం.. ఏపీని కాపాడుకోవాలంటే జగన్ వల్లే సాధ్యం
ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు షూటింగ్ ఈవెంట్లలో భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం, రజతం రెండింటినీ గెలుచుకుని విజయం సాధించింది. కాగా.. సెమీ ఫైనల్లో హాంకాంగ్ జట్టు చేతిలో ఓడిన భారత మహిళల స్క్వాష్ జట్టు కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.