CAPF Bill: ఢిల్లీలో నేతలు బిజిబిజీ.. నేడు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF) బిల్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAPF Bill: దేశ రాజధాని న్యూఢిల్లీలో నేడు రాజకీయంగా అనేక కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఒకవైపు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF)కు సంబంధించిన కీలక బిల్లు ప్రవేశపెట్టబడుతుండగా, మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.
DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో “సాయుధ పోలీసు బలగాల సాధారణ పరిపాలన బిల్లు-2026” (CAPF)ను ప్రవేశపెట్టనున్నారు. దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ బిల్లు ద్వారా కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (Central Reserve Police Force (CRPF)), సరిహద్దు భద్రతా దళం (Border Security Force (BSF)), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (Central Industrial Security Force (CISF)), ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీస్ దళం (Indo-Tibetan Border Police (ITBP)), సశస్త్ర సీమా బలగం Sashastra Seema Bal (SSB) వంటి ఐదు ప్రధాన కేంద్ర సాయుధ బలగాలను ఒకే చట్ట పరిధిలోకి తీసుకురానున్నారు.
ఈ దళాల సంబంధించి నియామకాలు, సర్వీస్ నిబంధనలు, ఉన్నత స్థాయి పదవుల నిర్వహణ వంటి అంశాలను ఒకే చట్రంలోకి తీసుకురావడం ఈ బిల్లులో ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటివరకు అనధికారికంగా అమలవుతున్న విధానాన్ని చట్టబద్ధం చేయాలనే ప్రయత్నంగా దీనిని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత స్థాయి పోస్టుల్లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారుల నియామకానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే.. డైరెక్టర్ జనరల్ (DG) పోస్టులు పూర్తిగా IPS అధికారులకే కేటాయింపు జరుగుతుంది. ఇంకా ఇన్స్పెక్టర్ జనరల్ (IG) స్థాయి పోస్టుల్లో 50% IPS అధికారులకు, అలాగే అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ADG) స్థాయిలో కనీసం 67% IPS అధికారుల నియామకం జరగనుంది. ఇటీవల డెప్యుటేషన్ విధానంపై వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఈ విధానాన్ని చట్టబద్ధం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ముఖ్య ఆర్థిక అంశాలు చర్చకు రానున్నాయి. ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టనుంది. రేపు ముఖ్యమంత్రి రేఖ గుప్త బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి “గ్రీన్ బడ్జెట్” ఉండొచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఢిల్లీలో కాలుష్య నియంత్రణపై ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పథకాలు, నగర అభివృద్ధి చర్యలు ప్రధానంగా ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..