CAPF Bill: ఢిల్లీలో నేతలు బిజిబిజీ.. నేడు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF) బిల్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAPF Bill: దేశ రాజధాని న్యూఢిల్లీలో నేడు రాజకీయంగా అనేక కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఒకవైపు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF)కు సంబంధించిన కీలక బిల్లు ప్రవేశపెట్టబడుతుండగా, మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.
DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో “సాయుధ పోలీసు బలగాల సాధారణ పరిపాలన బిల్లు-2026” (CAPF)ను ప్రవేశపెట్టనున్నారు. దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ బిల్లు ద్వారా కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (Central Reserve Police Force (CRPF)), సరిహద్దు భద్రతా దళం (Border Security Force (BSF)), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (Central Industrial Security Force (CISF)), ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీస్ దళం (Indo-Tibetan Border Police (ITBP)), సశస్త్ర సీమా బలగం Sashastra Seema Bal (SSB) వంటి ఐదు ప్రధాన కేంద్ర సాయుధ బలగాలను ఒకే చట్ట పరిధిలోకి తీసుకురానున్నారు.
ఈ దళాల సంబంధించి నియామకాలు, సర్వీస్ నిబంధనలు, ఉన్నత స్థాయి పదవుల నిర్వహణ వంటి అంశాలను ఒకే చట్రంలోకి తీసుకురావడం ఈ బిల్లులో ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటివరకు అనధికారికంగా అమలవుతున్న విధానాన్ని చట్టబద్ధం చేయాలనే ప్రయత్నంగా దీనిని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత స్థాయి పోస్టుల్లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారుల నియామకానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే.. డైరెక్టర్ జనరల్ (DG) పోస్టులు పూర్తిగా IPS అధికారులకే కేటాయింపు జరుగుతుంది. ఇంకా ఇన్స్పెక్టర్ జనరల్ (IG) స్థాయి పోస్టుల్లో 50% IPS అధికారులకు, అలాగే అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ADG) స్థాయిలో కనీసం 67% IPS అధికారుల నియామకం జరగనుంది. ఇటీవల డెప్యుటేషన్ విధానంపై వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఈ విధానాన్ని చట్టబద్ధం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ముఖ్య ఆర్థిక అంశాలు చర్చకు రానున్నాయి. ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టనుంది. రేపు ముఖ్యమంత్రి రేఖ గుప్త బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి “గ్రీన్ బడ్జెట్” ఉండొచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఢిల్లీలో కాలుష్య నియంత్రణపై ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పథకాలు, నగర అభివృద్ధి చర్యలు ప్రధానంగా ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..