CAPF Bill: ఢిల్లీలో నేతలు బిజిబిజీ.. నేడు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF) బిల్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAPF Bill: దేశ రాజధాని న్యూఢిల్లీలో నేడు రాజకీయంగా అనేక కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఒకవైపు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF)కు సంబంధించిన కీలక బిల్లు ప్రవేశపెట్టబడుతుండగా, మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.
DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో “సాయుధ పోలీసు బలగాల సాధారణ పరిపాలన బిల్లు-2026” (CAPF)ను ప్రవేశపెట్టనున్నారు. దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ బిల్లు ద్వారా కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (Central Reserve Police Force (CRPF)), సరిహద్దు భద్రతా దళం (Border Security Force (BSF)), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (Central Industrial Security Force (CISF)), ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీస్ దళం (Indo-Tibetan Border Police (ITBP)), సశస్త్ర సీమా బలగం Sashastra Seema Bal (SSB) వంటి ఐదు ప్రధాన కేంద్ర సాయుధ బలగాలను ఒకే చట్ట పరిధిలోకి తీసుకురానున్నారు.
ఈ దళాల సంబంధించి నియామకాలు, సర్వీస్ నిబంధనలు, ఉన్నత స్థాయి పదవుల నిర్వహణ వంటి అంశాలను ఒకే చట్రంలోకి తీసుకురావడం ఈ బిల్లులో ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటివరకు అనధికారికంగా అమలవుతున్న విధానాన్ని చట్టబద్ధం చేయాలనే ప్రయత్నంగా దీనిని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత స్థాయి పోస్టుల్లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారుల నియామకానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే.. డైరెక్టర్ జనరల్ (DG) పోస్టులు పూర్తిగా IPS అధికారులకే కేటాయింపు జరుగుతుంది. ఇంకా ఇన్స్పెక్టర్ జనరల్ (IG) స్థాయి పోస్టుల్లో 50% IPS అధికారులకు, అలాగే అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ADG) స్థాయిలో కనీసం 67% IPS అధికారుల నియామకం జరగనుంది. ఇటీవల డెప్యుటేషన్ విధానంపై వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఈ విధానాన్ని చట్టబద్ధం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ముఖ్య ఆర్థిక అంశాలు చర్చకు రానున్నాయి. ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టనుంది. రేపు ముఖ్యమంత్రి రేఖ గుప్త బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి “గ్రీన్ బడ్జెట్” ఉండొచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఢిల్లీలో కాలుష్య నియంత్రణపై ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పథకాలు, నగర అభివృద్ధి చర్యలు ప్రధానంగా ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!