C 295 Transport Aircraft Bharat : భారత వైమానిక దళ సామర్థ్యం మరింత పెరగనుంది. భారత వాయుసేన అమ్ముల పొదిలో కొత్త యుద్ధ విమానాలు రానున్నాయి. బుధవారం స్పెయిన్ లోని సెవెల్లేలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరికి తొలి సీ–295 విమానాన్ని స్పెయిన్ అధికారులు అందిచారు. ఈ విమానం శుక్రవారం భారత్ కు చేరుకోనుంది. అందులో కాసేపు ప్రయాణించారు భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది ఆత్మనిర్భర్ భారత్ కు నిదర్శనమన్నారు. వాయుసేన వ్యూహాత్మక ఎయిర్ లిఫ్ట్ సామర్థ్యాలను ఇది మెరుగుపరుస్తుందని చెప్పారు. దేశంలో కొత్త శకానికి ఇది నాంది పలుకుతుందని పేర్కొ్న్నారు.
Also Read: Google: మార్కెట్లో ఆధిపత్యం కోసం ప్రతేడాది గూగుల్ ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుందో తెలుసా?
సీ–295 యుద్ధ విమానాల కొనుగోలుకు స్పెయిన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. మొత్తం 56 విమానాలకు రూ.21,935 వేల కోట్లతో డీల్ కుదిరిందని ఈ డీల్లో భాగంగా 16 విమానాలను 2025లోగా స్పెయిన్ తయారు చేసి ఇస్తుందని వివరించారు. 17వ విమానం నుంచి భారత్ లో వీటి తయారీ మొదలవుతుందని, మిగతా 40 యుద్ధ విమానాలను గుజరాత్ లోని వడోదరలో తయారు చేయడానికి టీఏఎస్ఎల్ కంపెనీతో స్పెయిన్ కంపెనీ డీల్ కుదుర్చుకుందని తెలిపారు. ఇది దేశంలో తయారైన మొదటి మిలిటరీ రవాణా విమానం అవుతుందన్నారు. ఈ విమానంలో ఒకేసారి 71 మంది జవాన్లను లేదంటే 50 మంది పారాట్రూపర్లను సరిహద్దులకు తరలించవచ్చని వివరించారు. వాయుసేన చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి. దీంతో భారత్ బలం మరింత పెరగనుంది.