Pakistan: పాకిస్తాన్లో దారుణం.. బస్సు కాలువలో పడి 20 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ దేశంలో దారుణం చోటు చేసుకుంది. ఇవాళ (శుక్రవారం) వాయువ్య పాకిస్తాన్లోని కొండ ప్రాంతం నుంచి ప్రయాణీకులతో కూడిన బస్సు లోయలో జారిపడటంతో దాదాపు 20 మంది వరకు మరణించారు. గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలోని డయామర్ జిల్లాలోని కారకోరం హైవేపై ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. బస్సు రావల్పిండి నుంచి హుంజా వెళ్తున్న క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.. దీంతో ఒక్కసారిగా లోయలో పడిపోయింది.
Read Also: Harish Rao: కాంగ్రెస్ వచ్చాక బంగారం, నిత్యవసర ధరలు పెరిగాయి..
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ఇక, బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే విషయంపై స్పష్టత లేదని స్థానిక అధికారి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన 15 మందిని చిలాస్లోని ఆసుపత్రికి తరలించాం.. అలాగే, మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Read Also: Noida : డాగ్ లవర్స్ తాట తీసిన.. నోయిడా జనాలు.. స్టేషన్లో రచ్చ రచ్చ
కాగా, ఈ ఘటనపై గిల్గిత్ బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి హాజీ గుల్బర్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని పరిపాలన శాఖ అధికారులను ఆదేశించారు. ప్రమాదం తర్వాత చిలాస్ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించామని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫరక్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!