Bumper Offer: ఓట్లేయండి.. లక్కీడ్రాలో ల్యాప్టాప్లు, డైమండ్ రింగ్స్ గెలుచుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావుడి నెలకొంది. అయితే, ఎన్నికల గురించి ఓటింగ్ కోసం ఓటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో సీనియర్ అధికారులు కూడా బస్టాపులు, దుకాణాలకు వెళ్లి ఓటర్లకు ఓటింగ్ పై అవగాహన కల్పించడంతోపాటు ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.
Also Read: Lakshmi Parvathi: సినిమా హీరో పవన్.. రియల్ హీరో జగన్.. బాబును ఓడించండి..!
Also Read
- IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
- Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
- Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
తాజాగా, మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లాలో ఎన్నికల అధికారులు ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా నజరానాలు కూడా ఉన్నట్లు తెలుపుతున్నారు. రండి, ఓటు వేసి ల్యాప్టాప్లు, డైమండ్ రింగ్ లను గెలవండి’ అని ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. దీంతో పాటు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, సైకిళ్లు, స్కూటర్లను బహుమతులుగా అందిస్తామని ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇందుకోసం భోపాల్ లోని కొన్ని చోట్ల కూపన్ బాక్సులను కూడా ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా వారి వివరాలతో ఫారమ్ లను పూరించాలి. అలాగే వాటిని వోచర్ బాక్స్ లలో వేయాలి. విజేతలు ఓటు వేసిన వేలిపై ఇంక్ ప్రింట్ చూపిస్తే బహుమతి అందుకుంటారని అధికారులు తెలిపారు. అయితే, 2019 ఎన్నికలతో పోలిస్తే, మధ్యప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి, రెండవ దశల్లో ఓట్ల శాతం తక్కువగా ఉండటంతో అధికారులు ఈ కొత్త స్కింను ప్రవేశపెట్టారు.
Also Read: T20 World Cup 2024: చాలా నిరాశ చెందా.. భారత జట్టులో మావోడు ఒక్కడూ లేడు: స్టార్ హీరో
ఇకపోతే, మంగళవారం నాడు ఎన్నికల కమిషన్ పార్లమెంటరీ ఎన్నికల మొదటి, రెండవ దశల ఎన్నికల పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. మొదటి దశలో 66.14 %, రెండో దశలో 66.71 % ఓటింగ్ గణాంకాలు నమోదయ్యాయని ఈసీ తెలిపింది. అయితే ఓట్ల శాతాన్ని ప్రకటించడంలో కమిషన్ జాప్యానికి కారణం మొదటి దశ ఎన్నికలు ముగిసి పదకొండు రోజులు, రెండో విడత ఎన్నికలు జరిగి నాలుగు రోజులు గడిచిపోవడమేనని విపక్షాలు గతంలో పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండడంతో అధికారులు ఈ విధానాన్ని ప్రకటించారు. మే 7న భోపాల్ లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!