Bumper Offer: ఓట్లేయండి.. లక్కీడ్రాలో ల్యాప్టాప్లు, డైమండ్ రింగ్స్ గెలుచుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావుడి నెలకొంది. అయితే, ఎన్నికల గురించి ఓటింగ్ కోసం ఓటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో సీనియర్ అధికారులు కూడా బస్టాపులు, దుకాణాలకు వెళ్లి ఓటర్లకు ఓటింగ్ పై అవగాహన కల్పించడంతోపాటు ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.
Also Read: Lakshmi Parvathi: సినిమా హీరో పవన్.. రియల్ హీరో జగన్.. బాబును ఓడించండి..!
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
తాజాగా, మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లాలో ఎన్నికల అధికారులు ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా నజరానాలు కూడా ఉన్నట్లు తెలుపుతున్నారు. రండి, ఓటు వేసి ల్యాప్టాప్లు, డైమండ్ రింగ్ లను గెలవండి’ అని ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. దీంతో పాటు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, సైకిళ్లు, స్కూటర్లను బహుమతులుగా అందిస్తామని ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇందుకోసం భోపాల్ లోని కొన్ని చోట్ల కూపన్ బాక్సులను కూడా ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా వారి వివరాలతో ఫారమ్ లను పూరించాలి. అలాగే వాటిని వోచర్ బాక్స్ లలో వేయాలి. విజేతలు ఓటు వేసిన వేలిపై ఇంక్ ప్రింట్ చూపిస్తే బహుమతి అందుకుంటారని అధికారులు తెలిపారు. అయితే, 2019 ఎన్నికలతో పోలిస్తే, మధ్యప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి, రెండవ దశల్లో ఓట్ల శాతం తక్కువగా ఉండటంతో అధికారులు ఈ కొత్త స్కింను ప్రవేశపెట్టారు.
Also Read: T20 World Cup 2024: చాలా నిరాశ చెందా.. భారత జట్టులో మావోడు ఒక్కడూ లేడు: స్టార్ హీరో
ఇకపోతే, మంగళవారం నాడు ఎన్నికల కమిషన్ పార్లమెంటరీ ఎన్నికల మొదటి, రెండవ దశల ఎన్నికల పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. మొదటి దశలో 66.14 %, రెండో దశలో 66.71 % ఓటింగ్ గణాంకాలు నమోదయ్యాయని ఈసీ తెలిపింది. అయితే ఓట్ల శాతాన్ని ప్రకటించడంలో కమిషన్ జాప్యానికి కారణం మొదటి దశ ఎన్నికలు ముగిసి పదకొండు రోజులు, రెండో విడత ఎన్నికలు జరిగి నాలుగు రోజులు గడిచిపోవడమేనని విపక్షాలు గతంలో పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండడంతో అధికారులు ఈ విధానాన్ని ప్రకటించారు. మే 7న భోపాల్ లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?