Bumper Offer: ఓట్లేయండి.. లక్కీడ్రాలో ల్యాప్టాప్లు, డైమండ్ రింగ్స్ గెలుచుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావుడి నెలకొంది. అయితే, ఎన్నికల గురించి ఓటింగ్ కోసం ఓటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో సీనియర్ అధికారులు కూడా బస్టాపులు, దుకాణాలకు వెళ్లి ఓటర్లకు ఓటింగ్ పై అవగాహన కల్పించడంతోపాటు ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.
Also Read: Lakshmi Parvathi: సినిమా హీరో పవన్.. రియల్ హీరో జగన్.. బాబును ఓడించండి..!
Also Read
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
తాజాగా, మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లాలో ఎన్నికల అధికారులు ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా నజరానాలు కూడా ఉన్నట్లు తెలుపుతున్నారు. రండి, ఓటు వేసి ల్యాప్టాప్లు, డైమండ్ రింగ్ లను గెలవండి’ అని ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. దీంతో పాటు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, సైకిళ్లు, స్కూటర్లను బహుమతులుగా అందిస్తామని ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇందుకోసం భోపాల్ లోని కొన్ని చోట్ల కూపన్ బాక్సులను కూడా ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా వారి వివరాలతో ఫారమ్ లను పూరించాలి. అలాగే వాటిని వోచర్ బాక్స్ లలో వేయాలి. విజేతలు ఓటు వేసిన వేలిపై ఇంక్ ప్రింట్ చూపిస్తే బహుమతి అందుకుంటారని అధికారులు తెలిపారు. అయితే, 2019 ఎన్నికలతో పోలిస్తే, మధ్యప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి, రెండవ దశల్లో ఓట్ల శాతం తక్కువగా ఉండటంతో అధికారులు ఈ కొత్త స్కింను ప్రవేశపెట్టారు.
Also Read: T20 World Cup 2024: చాలా నిరాశ చెందా.. భారత జట్టులో మావోడు ఒక్కడూ లేడు: స్టార్ హీరో
ఇకపోతే, మంగళవారం నాడు ఎన్నికల కమిషన్ పార్లమెంటరీ ఎన్నికల మొదటి, రెండవ దశల ఎన్నికల పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. మొదటి దశలో 66.14 %, రెండో దశలో 66.71 % ఓటింగ్ గణాంకాలు నమోదయ్యాయని ఈసీ తెలిపింది. అయితే ఓట్ల శాతాన్ని ప్రకటించడంలో కమిషన్ జాప్యానికి కారణం మొదటి దశ ఎన్నికలు ముగిసి పదకొండు రోజులు, రెండో విడత ఎన్నికలు జరిగి నాలుగు రోజులు గడిచిపోవడమేనని విపక్షాలు గతంలో పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండడంతో అధికారులు ఈ విధానాన్ని ప్రకటించారు. మే 7న భోపాల్ లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!