Bumper Offer: ఓట్లేయండి.. లక్కీడ్రాలో ల్యాప్టాప్లు, డైమండ్ రింగ్స్ గెలుచుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావుడి నెలకొంది. అయితే, ఎన్నికల గురించి ఓటింగ్ కోసం ఓటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో సీనియర్ అధికారులు కూడా బస్టాపులు, దుకాణాలకు వెళ్లి ఓటర్లకు ఓటింగ్ పై అవగాహన కల్పించడంతోపాటు ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.
Also Read: Lakshmi Parvathi: సినిమా హీరో పవన్.. రియల్ హీరో జగన్.. బాబును ఓడించండి..!
Also Read
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
- రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
తాజాగా, మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లాలో ఎన్నికల అధికారులు ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా నజరానాలు కూడా ఉన్నట్లు తెలుపుతున్నారు. రండి, ఓటు వేసి ల్యాప్టాప్లు, డైమండ్ రింగ్ లను గెలవండి’ అని ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. దీంతో పాటు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, సైకిళ్లు, స్కూటర్లను బహుమతులుగా అందిస్తామని ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇందుకోసం భోపాల్ లోని కొన్ని చోట్ల కూపన్ బాక్సులను కూడా ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా వారి వివరాలతో ఫారమ్ లను పూరించాలి. అలాగే వాటిని వోచర్ బాక్స్ లలో వేయాలి. విజేతలు ఓటు వేసిన వేలిపై ఇంక్ ప్రింట్ చూపిస్తే బహుమతి అందుకుంటారని అధికారులు తెలిపారు. అయితే, 2019 ఎన్నికలతో పోలిస్తే, మధ్యప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి, రెండవ దశల్లో ఓట్ల శాతం తక్కువగా ఉండటంతో అధికారులు ఈ కొత్త స్కింను ప్రవేశపెట్టారు.
Also Read: T20 World Cup 2024: చాలా నిరాశ చెందా.. భారత జట్టులో మావోడు ఒక్కడూ లేడు: స్టార్ హీరో
ఇకపోతే, మంగళవారం నాడు ఎన్నికల కమిషన్ పార్లమెంటరీ ఎన్నికల మొదటి, రెండవ దశల ఎన్నికల పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. మొదటి దశలో 66.14 %, రెండో దశలో 66.71 % ఓటింగ్ గణాంకాలు నమోదయ్యాయని ఈసీ తెలిపింది. అయితే ఓట్ల శాతాన్ని ప్రకటించడంలో కమిషన్ జాప్యానికి కారణం మొదటి దశ ఎన్నికలు ముగిసి పదకొండు రోజులు, రెండో విడత ఎన్నికలు జరిగి నాలుగు రోజులు గడిచిపోవడమేనని విపక్షాలు గతంలో పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండడంతో అధికారులు ఈ విధానాన్ని ప్రకటించారు. మే 7న భోపాల్ లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
ట్రెండింగ్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?