Nambala Keshava Rao: బీటెక్ టు నక్సలిజం.. 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే!
- ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు మృతి
- కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని జియన్నపేట
- వరంగల్ ఆర్ఈసీలో బీటెక్ పూర్తి
- ఎంటెక్ మద్యలోనే ఆపేసి ఉద్యమంలో చేరిన బసవరాజు
- వ్యూహకర్తగా కేశవరావుకు మంచి పేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీస్ బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (70) అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్ఛార్జ్ మధు, మావోయిస్టు పత్రిక జంగ్ ఎడిటర్ నవీన్ ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావు పూర్తి డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
నంబాల కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని జియన్నపేట. 1955లో కేశవరావు జియన్నపేటలో జన్మించారు. కేశవరావుకు ఓ సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఆయన తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా.. వరంగల్ ఆర్ఈసీలో బీటెక్ సీట్ రావడంతో జాయిన్ అయ్యారు. కేశవరావు బీటెక్ చదువుతుండగానే.. రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ఎస్యూ)వైపు అడుగులు వేశారు. 1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు సీపీఐ పీపుల్స్వార్ గ్రూపు సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులై.. ఎంటెక్ మద్యలోనే ఆపేసి ఉద్యమంలో చేరారు. అప్పటినుంచి 43 ఏళ్లుగా కేశవరావు మావోయిస్టు రూపంలో అజ్ఞాతంలోనే ఉన్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Also Read: China- Pakistan: భారత్ పాక్ ఉద్రిక్తత మధ్య.. పాకిస్థాన్, చైనా మధ్య కీలక ఒప్పందం..
1980లో ఆంధ్రప్రదేశ్లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్ ఏర్పడినప్పుడు నంబాల కేశవరావు కీలక నిర్వాహకులలో ఒకరుగా ఉన్నారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలో మొదటి కమాండర్ అతనే. గెరిల్లా యుద్దం, ఎక్స్ ప్లోజివ్ డివైజ్ వాడకంలో ఎక్స్పర్టు. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టిటిఇ నుండి గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. 1992లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటి సభ్యునిగా ఎన్నికయ్యారు. 2004లో మావోయిస్టు సెంట్రల్ మిలటరీ కమీషన్ అధిపతిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమితులయ్యారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో దాడుల వెనుక ఆయన హస్తం ఉంది. ఏపీలోని ఎమ్మెల్యే కిడారి ఈశ్వరరావు హత్యకు కేశవరావు ప్రాధాన సూత్రధారిగా ఉన్నారు. 2010 దంతేవాడలో జరిగిన 76 మంది సిఆర్పిఎఫ్ సభ్యుల బ్లాస్ట్ కు సైతం అతనే సూత్రధారి. మిలటరీ దాడుల వ్యూహకర్తగా కేశవరావుకు మంచి పేరుంది. కేశవరావుపై రూ.1.5కోట్లు రివార్డు ఉంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!