China- Pakistan: భారత్ పాక్ ఉద్రిక్తత మధ్య.. పాకిస్థాన్, చైనా మధ్య కీలక ఒప్పందం..
- చైనాతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్న పాకిస్థాన్
- దీన్ని తన విజయాలలో ఒకటిగా భావిస్తున్న పాక్
- కీలక రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి అంగీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంతో ఉద్రిక్తత మధ్య, పాకిస్థాన్ చైనాతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిని పాకిస్థాన్ తన విజయాలలో ఒకటిగా భావిస్తోంది. వాణిజ్యం, వ్యవసాయం, పరిశ్రమలు సహా అనేక కీలక రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి పాకిస్థాన్ అంగీకరించింది. పాకిస్థాన్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. మంగళవారం చైనాలో వాంగ్ యితో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సమావేశం తర్వాత చైనాతో వాణిజ్య ఒప్పందం ప్రకటించారు.
READ MORE: Honda X-ADV: అడ్వెంచర్ రైడింగ్కు అనుగుణంగా స్టైలిష్ లుక్ తో X-ADV లాంచ్..!
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
చైనాతో జరిగిన సమావేశంలో ఆర్థిక ఒప్పందాన్ని బలోపేతం చేయడమే కాకుండా, చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (CPEC)ని ఆఫ్ఘనిస్తాన్కు విస్తరించాలని కూడా నిర్ణయించినట్లు పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనితో పాటు, రెండు దేశాలు స్థిరత్వం, శాంతిని కాపాడుకోవడంపై కూడా చర్చించాయని వెల్లడించింది. వాణిజ్యం, పెట్టుబడి, వ్యవసాయం, పారిశ్రామికీకరణ, ఇతర రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి చైనా, పాకిస్థాన్ అంగీకరించాయని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
READ MORE: Tollywood: స్టార్ హీరో సినిమా షూటింగ్.. సరైన తిండి కూడా పెట్టలేదట
ఈ భేటీలో సిపెక్ విస్తరణపై నిర్ణయం తీసుకున్నట్లు పాక్ విదేశాంగశాఖ ప్రకటించింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ మంత్రి చేపట్టిన తొలి చైనా యాత్ర ఇదే. ‘‘పాకిస్థాన్, చైనా, అఫ్గానిస్థాన్లు ప్రాంతీయ శాంతి, సుస్థిరత అభివృద్ధికి కట్టుబడి ఉంటాయి. దౌత్య సంబంధాలు కొనసాగించడం, కమ్యూనికేషన్లను బలోపేతం చేసుకోవడం, అభివృద్ధి వంటివే కీలకమైనవి. చైనా-పాక్ ఆర్థిక నడవాను అఫ్గానిస్థాన్ వరకు పొడిగించేందుకు అంగీకరించారు’’ అని దార్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
READ MORE: Heroines : హీరోయిన్ల ఘాటు అందాలు.. ఆఫర్లు తెచ్చిపెడుతున్న ఐటెం సాంగ్స్..
కాగా.. చైనా నుంచి పాక్ బలూచిస్థాన్లోని గ్వదర్ వరకు సాగే సిపెక్ చాలా కీలకమైందని చెబుతున్నారు. చైనా నౌకలు పర్షియన్ సింధు శాఖ ద్వారా పయనిస్తూ ఎగుమతి, దిగుమతులు నిర్వహిస్తాయి. ఆ సింధు శాఖ మార్గాన్ని కాపాడుకోవడానికి సిపెక్లో భాగంగా గ్వదర్ రేవు నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే చైనా నౌకలు మలక్కా జలసంధిపై ఆధారపడటం తగ్గిపోతుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!