Akash anand: బీఎస్పీ రాజకీయ వారసుడిగా తొలగింపుపై ఆకాశ్ రియాక్షన్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ కో-ఆర్డినేటర్ పదవి నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతి బుధవారం తొలగించారు. ఈ తొలగింపుపై తాజాగా గురువారం ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా ఆకాశ్ ఆనంద్ స్పందించారు. మాయావతి.. బహుజన సమాజానికి రోల్ మోడల్ అని ఆయన తెలిపారు. బహుజనలు అంటే.. దళితులు, ఎస్టీలు, ఓబీసీలు అని పేర్కొన్నారు. మీ పోరాటం వల్లే బహుజన సమాజానికి ఇంత రాజకీయం బలం చేకూరిందని తెలిపారు. బహుజన సమాజం గౌరవంగా బ్రతకటం నేర్చుకుందన్నారు. మీరే మా అధినేత్రి అని.. తన తుది శ్వాస వరకు భీమ్ మిషన్, బహుజన సమాజం కోసం పోరాడతానని ఆకాశ్ ఆనంద్ ‘ఎక్స్’లో తెలిపారు.
ఇది కూడా చదవండి: Elections 2024: తెలంగాణ నుంచి సొంతూళ్లకు ఓటర్లు.. నెల క్రితమే రిజర్వేషన్లు..
Also Read
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
- Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
ఇటీవల ఆకాశ్ ఆనంద్ బీజేపీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆకాశ్ రాజకీయంగా పరిణతి సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నట్లు మాయావతి ప్రకటించారు. ఇటీవల ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆకాశ్ మాట్లాడుతూ యూపీలోని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ గవర్నమెంట్గా అభివర్ణించారు. అలాగే రాష్ట్రంలోని యువతను ఆకలితో ఉంచుతూ.. పెద్దలను బానిసలుగా మార్చుకుంటోందని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ అధికారులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద నోటీసులు అందజేశారు. ఆకాశ్తో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఆకాశ్కు సంబంధించిన అన్ని ర్యాలీలను బీఎస్పీ రద్దు చేసింది.
ఇది కూడా చదవండి: AP Elections 2024: ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యేపై దాడి.. కిందపడిపోయిన ఆనం
ఇదిలా ఉంటే 2023 డిసెంబర్లో మాయావతి తన రాజకీయ వారసుడిగా ఆకాశ్ను ప్రకటించింది. మాయావతి తమ్ముడి కుమారుడైన ఆకాశ్ లండన్లో ఎంబీఏ చదివారు. ఇక.. 2017లో బీఎస్పీలో చేరారు. అనంతరం 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అత్యధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
పార్టీ జాతీయ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించే ముందు ఆనంద్ పరిపక్వతకి చేరుకోవాలని మాయావతి చెప్పడంతో మే 7న ఆనంద్పై చర్యకు ఉప్రక్రమించారు. ఆకాష్ తండ్రి ఆనంద్ కుమార్ మాత్రం పార్టీలో తన పాత్రలో కొనసాగుతారని మాయావతి తెలిపారు.
ఇది కూడా చదవండి: Uttarpradesh : 29ఏళ్ల నాటి కేసు.. 100వారెంట్ల తర్వాత కూడా హాజరుకాని ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్
తాజావార్తలు
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..