Investors Wealth: రాకెట్ వేగంతో ఇన్వెస్టర్ల సంపద.. రూ. 315 లక్షల కోట్లు దాటిన కంపెనీల మార్కెట్ క్యాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Investors Wealth: స్టాక్ మార్కెట్ మళ్లీ విపరీతమైన వృద్ధిని సాధిస్తోంది. బీఎస్ఈలో జాబితా చేయబడిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. రూ. 315 లక్షల కోట్లు దాటింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్లు బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రికార్డు స్థాయికి చేరుకోవడంలో ప్రధాన సహకారాన్ని అందించాయి. ఇవి గత కొన్ని సెషన్లలో బలమైన వృద్ధిని సాధిస్తున్నాయి. సోమవారం బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 315.04 లక్షల కోట్లకు చేరుకుంది. నేటి ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ క్యాప్లో రూ.2.66 లక్షల కోట్ల పెరుగుదల కనిపించింది. మరోవైపు గత రెండు ట్రెండింగ్ సెషన్లలో బీఎస్ఈ స్టాక్స్ మార్కెట్ క్యాప్లో రూ.5.42 లక్షల కోట్ల పెరుగుదల కనిపించింది. స్టాక్ మార్కెట్లో ఇటీవలి బూమ్ తర్వాత, స్టాక్లలో అద్భుతమైన ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపద విపరీతంగా పెరిగింది.
Read Also:School Holidays: తెలంగాణలో భారీ వర్షాలు.. మూడురోజులు విద్యా సంస్థలకు సెలవులు
Also Read
మార్చి 20, 2023న బీఎస్ఈ సెన్సెక్స్ 57,000 స్థాయికి పడిపోయింది. అప్పుడు బీఎస్ఈలో జాబితా చేయబడిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 255.64 లక్షల కోట్లకు తగ్గింది. దీని తరువాత సెన్సెక్స్ 28 జూలై 2023న 67,619 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. కానీ ఇప్పుడు సెన్సెక్స్ 2,000 పాయింట్లు క్షీణించి 65,628 స్థాయి వద్ద ఉన్నప్పుడు.. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.315 లక్షల కోట్లు దాటింది. అంటే మార్చి 20 నుంచి గడిచిన ఐదున్నర నెలల కాలంలో మార్కెట్ క్యాప్ లో రూ.60 లక్షల కోట్ల జంప్ నమోదైంది.
Read Also:Asia Cup 2023: సూపర్-4కు భారత్ అర్హత.. ఇండో-పాక్ మ్యాచ్ మళ్లీ ఎప్పుడంటే?
ఇటీవలి కాలంలో సెన్సెక్స్-నిఫ్టీలో చేర్చబడిన స్టాక్లలో క్షీణత ఉంది. అయితే మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ ఇండెక్స్ రికార్డు స్థాయిలో ట్రేడవుతోంది. రెండు ఇండెక్స్లు తమ అప్వర్డ్ ట్రెండ్ను కొనసాగిస్తున్నాయి. బిఎస్ఇ మార్కెట్ క్యాప్ రూ. 315 లక్షల కోట్లను దాటడంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్లు చాలా దోహదపడ్డాయి. గ్లోబల్ మార్కెట్ నుంచి మంచి సంకేతాలు రావడం, దేశీయ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరగడం, వాహనాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరగడం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచకపోవడం వంటి సంకేతాల వల్ల మార్కెట్ ఊపందుకుంది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రాకెట్ వేగంతో పెరుగుతోంది.
తాజావార్తలు
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!