Investors Wealth: రాకెట్ వేగంతో ఇన్వెస్టర్ల సంపద.. రూ. 315 లక్షల కోట్లు దాటిన కంపెనీల మార్కెట్ క్యాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Investors Wealth: స్టాక్ మార్కెట్ మళ్లీ విపరీతమైన వృద్ధిని సాధిస్తోంది. బీఎస్ఈలో జాబితా చేయబడిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. రూ. 315 లక్షల కోట్లు దాటింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్లు బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రికార్డు స్థాయికి చేరుకోవడంలో ప్రధాన సహకారాన్ని అందించాయి. ఇవి గత కొన్ని సెషన్లలో బలమైన వృద్ధిని సాధిస్తున్నాయి. సోమవారం బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 315.04 లక్షల కోట్లకు చేరుకుంది. నేటి ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ క్యాప్లో రూ.2.66 లక్షల కోట్ల పెరుగుదల కనిపించింది. మరోవైపు గత రెండు ట్రెండింగ్ సెషన్లలో బీఎస్ఈ స్టాక్స్ మార్కెట్ క్యాప్లో రూ.5.42 లక్షల కోట్ల పెరుగుదల కనిపించింది. స్టాక్ మార్కెట్లో ఇటీవలి బూమ్ తర్వాత, స్టాక్లలో అద్భుతమైన ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపద విపరీతంగా పెరిగింది.
Read Also:School Holidays: తెలంగాణలో భారీ వర్షాలు.. మూడురోజులు విద్యా సంస్థలకు సెలవులు
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
మార్చి 20, 2023న బీఎస్ఈ సెన్సెక్స్ 57,000 స్థాయికి పడిపోయింది. అప్పుడు బీఎస్ఈలో జాబితా చేయబడిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 255.64 లక్షల కోట్లకు తగ్గింది. దీని తరువాత సెన్సెక్స్ 28 జూలై 2023న 67,619 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. కానీ ఇప్పుడు సెన్సెక్స్ 2,000 పాయింట్లు క్షీణించి 65,628 స్థాయి వద్ద ఉన్నప్పుడు.. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.315 లక్షల కోట్లు దాటింది. అంటే మార్చి 20 నుంచి గడిచిన ఐదున్నర నెలల కాలంలో మార్కెట్ క్యాప్ లో రూ.60 లక్షల కోట్ల జంప్ నమోదైంది.
Read Also:Asia Cup 2023: సూపర్-4కు భారత్ అర్హత.. ఇండో-పాక్ మ్యాచ్ మళ్లీ ఎప్పుడంటే?
ఇటీవలి కాలంలో సెన్సెక్స్-నిఫ్టీలో చేర్చబడిన స్టాక్లలో క్షీణత ఉంది. అయితే మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ ఇండెక్స్ రికార్డు స్థాయిలో ట్రేడవుతోంది. రెండు ఇండెక్స్లు తమ అప్వర్డ్ ట్రెండ్ను కొనసాగిస్తున్నాయి. బిఎస్ఇ మార్కెట్ క్యాప్ రూ. 315 లక్షల కోట్లను దాటడంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్లు చాలా దోహదపడ్డాయి. గ్లోబల్ మార్కెట్ నుంచి మంచి సంకేతాలు రావడం, దేశీయ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరగడం, వాహనాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరగడం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచకపోవడం వంటి సంకేతాల వల్ల మార్కెట్ ఊపందుకుంది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రాకెట్ వేగంతో పెరుగుతోంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!