Investors Wealth: రాకెట్ వేగంతో ఇన్వెస్టర్ల సంపద.. రూ. 315 లక్షల కోట్లు దాటిన కంపెనీల మార్కెట్ క్యాప్
Investors Wealth: స్టాక్ మార్కెట్ మళ్లీ విపరీతమైన వృద్ధిని సాధిస్తోంది. బీఎస్ఈలో జాబితా చేయబడిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. రూ. 315 లక్షల కోట్లు దాటింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్లు బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రికార్డు స్థాయికి చేరుకోవడంలో ప్రధాన సహకారాన్ని అందించాయి. ఇవి గత కొన్ని సెషన్లలో బలమైన వృద్ధిని సాధిస్తున్నాయి. సోమవారం బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 315.04 లక్షల కోట్లకు చేరుకుంది. నేటి ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ క్యాప్లో రూ.2.66 లక్షల కోట్ల పెరుగుదల కనిపించింది. మరోవైపు గత రెండు ట్రెండింగ్ సెషన్లలో బీఎస్ఈ స్టాక్స్ మార్కెట్ క్యాప్లో రూ.5.42 లక్షల కోట్ల పెరుగుదల కనిపించింది. స్టాక్ మార్కెట్లో ఇటీవలి బూమ్ తర్వాత, స్టాక్లలో అద్భుతమైన ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపద విపరీతంగా పెరిగింది.
Read Also:School Holidays: తెలంగాణలో భారీ వర్షాలు.. మూడురోజులు విద్యా సంస్థలకు సెలవులు
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
మార్చి 20, 2023న బీఎస్ఈ సెన్సెక్స్ 57,000 స్థాయికి పడిపోయింది. అప్పుడు బీఎస్ఈలో జాబితా చేయబడిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 255.64 లక్షల కోట్లకు తగ్గింది. దీని తరువాత సెన్సెక్స్ 28 జూలై 2023న 67,619 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. కానీ ఇప్పుడు సెన్సెక్స్ 2,000 పాయింట్లు క్షీణించి 65,628 స్థాయి వద్ద ఉన్నప్పుడు.. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.315 లక్షల కోట్లు దాటింది. అంటే మార్చి 20 నుంచి గడిచిన ఐదున్నర నెలల కాలంలో మార్కెట్ క్యాప్ లో రూ.60 లక్షల కోట్ల జంప్ నమోదైంది.
Read Also:Asia Cup 2023: సూపర్-4కు భారత్ అర్హత.. ఇండో-పాక్ మ్యాచ్ మళ్లీ ఎప్పుడంటే?
ఇటీవలి కాలంలో సెన్సెక్స్-నిఫ్టీలో చేర్చబడిన స్టాక్లలో క్షీణత ఉంది. అయితే మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ ఇండెక్స్ రికార్డు స్థాయిలో ట్రేడవుతోంది. రెండు ఇండెక్స్లు తమ అప్వర్డ్ ట్రెండ్ను కొనసాగిస్తున్నాయి. బిఎస్ఇ మార్కెట్ క్యాప్ రూ. 315 లక్షల కోట్లను దాటడంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్లు చాలా దోహదపడ్డాయి. గ్లోబల్ మార్కెట్ నుంచి మంచి సంకేతాలు రావడం, దేశీయ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరగడం, వాహనాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరగడం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచకపోవడం వంటి సంకేతాల వల్ల మార్కెట్ ఊపందుకుంది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రాకెట్ వేగంతో పెరుగుతోంది.
తాజావార్తలు
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో