Investors Wealth: రాకెట్ వేగంతో ఇన్వెస్టర్ల సంపద.. రూ. 315 లక్షల కోట్లు దాటిన కంపెనీల మార్కెట్ క్యాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Investors Wealth: స్టాక్ మార్కెట్ మళ్లీ విపరీతమైన వృద్ధిని సాధిస్తోంది. బీఎస్ఈలో జాబితా చేయబడిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. రూ. 315 లక్షల కోట్లు దాటింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్లు బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రికార్డు స్థాయికి చేరుకోవడంలో ప్రధాన సహకారాన్ని అందించాయి. ఇవి గత కొన్ని సెషన్లలో బలమైన వృద్ధిని సాధిస్తున్నాయి. సోమవారం బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 315.04 లక్షల కోట్లకు చేరుకుంది. నేటి ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ క్యాప్లో రూ.2.66 లక్షల కోట్ల పెరుగుదల కనిపించింది. మరోవైపు గత రెండు ట్రెండింగ్ సెషన్లలో బీఎస్ఈ స్టాక్స్ మార్కెట్ క్యాప్లో రూ.5.42 లక్షల కోట్ల పెరుగుదల కనిపించింది. స్టాక్ మార్కెట్లో ఇటీవలి బూమ్ తర్వాత, స్టాక్లలో అద్భుతమైన ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపద విపరీతంగా పెరిగింది.
Read Also:School Holidays: తెలంగాణలో భారీ వర్షాలు.. మూడురోజులు విద్యా సంస్థలకు సెలవులు
Also Read
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
- LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
మార్చి 20, 2023న బీఎస్ఈ సెన్సెక్స్ 57,000 స్థాయికి పడిపోయింది. అప్పుడు బీఎస్ఈలో జాబితా చేయబడిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 255.64 లక్షల కోట్లకు తగ్గింది. దీని తరువాత సెన్సెక్స్ 28 జూలై 2023న 67,619 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. కానీ ఇప్పుడు సెన్సెక్స్ 2,000 పాయింట్లు క్షీణించి 65,628 స్థాయి వద్ద ఉన్నప్పుడు.. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.315 లక్షల కోట్లు దాటింది. అంటే మార్చి 20 నుంచి గడిచిన ఐదున్నర నెలల కాలంలో మార్కెట్ క్యాప్ లో రూ.60 లక్షల కోట్ల జంప్ నమోదైంది.
Read Also:Asia Cup 2023: సూపర్-4కు భారత్ అర్హత.. ఇండో-పాక్ మ్యాచ్ మళ్లీ ఎప్పుడంటే?
ఇటీవలి కాలంలో సెన్సెక్స్-నిఫ్టీలో చేర్చబడిన స్టాక్లలో క్షీణత ఉంది. అయితే మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ ఇండెక్స్ రికార్డు స్థాయిలో ట్రేడవుతోంది. రెండు ఇండెక్స్లు తమ అప్వర్డ్ ట్రెండ్ను కొనసాగిస్తున్నాయి. బిఎస్ఇ మార్కెట్ క్యాప్ రూ. 315 లక్షల కోట్లను దాటడంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్లు చాలా దోహదపడ్డాయి. గ్లోబల్ మార్కెట్ నుంచి మంచి సంకేతాలు రావడం, దేశీయ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరగడం, వాహనాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరగడం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచకపోవడం వంటి సంకేతాల వల్ల మార్కెట్ ఊపందుకుంది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రాకెట్ వేగంతో పెరుగుతోంది.
తాజావార్తలు
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?