Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.. గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం పనిచేస్తున్న వీర సాయిష్ని నిన్న రాత్రి కాల్చి చంపారు దుండగులు.. ఆ విద్యార్థి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు… ఉన్నత చదువుల కోసం (ఎమ్మెస్) అమెరికా వెళ్లిన సాయిష్ ప్రాణాలు ఇలా పోవడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇండియాకు చెందిన ఇద్దరు తెలుగు యువకుల మృతిలో పాలకొల్లుకు చెందిన సాయిష్ ఒకరు.. మరో నెలరోజుల్లో చదువు పూర్తి చేసుకునే సమయంలో వీర సాయిష్ ఇలా ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ఇక, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు అమెరికాలో మృతిచెందిన సాయిష్ తల్లి వీరా జయశ్రీ.. తండ్రి ఆఖరి కోరిక తీర్చడానికి వీరా సాయిష్ అమెరికా వెళ్ళాడు.. కొద్ది రోజుల్లో తిరిగి వస్తాడనుకున్న సాయిని దారుణంగా హత్యచేశారని కన్నీరుమున్నీరయ్యారు. తన సొంత ఖర్చులతో చదువు కొనసాగిస్తున్నాడు.. చదువుల్లో, ఆటల్లో యాక్టీవ్గా ఉండే వాడు.. అమెరికాలో సైతం అనేక ఆటల్లో ముందుండేవాడు.. కానీ, ఎదిగిన కొడుకు ఇలా అవుతాడు అనుకోలేదంటూ విలపించారు.. చదువుకునేందుకు వెళ్ళిన నా మేనల్లుడిని హత్యచేశారు.. డబ్బులేకుంటే వచ్చేయమని చాలా సార్లు చెప్పాను.. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి ఆదేశానికి బలిచ్చారు.. ఇలా ఎంతమంది తల్లిదండ్రులకు శోఖం మిగులుస్తారో అంటూ సాయి మేనత్త ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన వీరా సాయిష్ వయస్సు 23 ఏళ్లు.. గ్యాస్ స్టేషన్ లో డబ్బు దోచుకుని సాయిష్ ను హత్య చేశారు దుండగుడు.. పాలకొల్లుకు చెందిన సాయిష్ కుటుంబం కొద్ది కాలం క్రితం ఏలూరులో స్థిరపడ్డారు. కొద్దికాలం క్రితం అనారోగ్య కారణాలతో సాయిష్ తండ్రి కూడా మృతిచెందాడు.. ఏలూరుకు చెందిన వీర సాయిష్ పై అమెరికాలోని వెస్ట్ కొలంబస్ లో దుండగుడు కాల్పులు జరిపాడు.. అర్ధరాత్రి 12.50 గంటలకు దోపిడీని అడ్డుకునే ప్రయత్నంలో సాయిష్ ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. అనుమానితుడి ఫోటోలు విడుదల చేశారు కొలంబస్ పోలీసులు..
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!