Crime: భార్యను గొంతు నులిమి..తలను శరీరం నుంచి వేరు చేసి..దారుణ హత్య
- మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో దారుణం
- చిన్నపాటి ఇంట్లో గొడవల కారణంగా భార్య గొంతు నులిమి హత్య
- హత్య అనంతరం భార్య తలను శరీరం నుంచి వేరు చేసి భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో దారుణం వెలుగు చూసింది. చిన్నపాటి ఇంట్లో గొడవల కారణంగా భార్య గొంతు నులిమి హత్య చేశాడు భర్త. దీంతో కోపోద్రిక్తుడైన భర్త.. భార్య తలను శరీరం నుంచి వేరు చేశాడు. ఘటనకు పాల్పడిన తర్వాత, హంతకుడు భర్త అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన అనంతరం మృతురాలి కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించి తదుపరి చర్యలు చేపట్టారు.
READ MORE: Telangana DGP Jitender: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్
Also Read
ఈ ఘటన అంబాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇక్కడ ఓ భర్త తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఆనంద్ శర్మ తన భార్య ఛాయాతో కలిసి అంబాహ్లోని పూత్ రోడ్ సమీపంలో నివసిస్తున్నాడు. చిన్నపాటి గొడవలతో భార్య ఛాయాను ఆనంద్ హత్య చేశాడు. కిల్లర్ ఆనంద్ తన భార్య మెడను పదునైన ఆయుధంతో నరికి శరీరం నుంచి కోసేశాడు. విషయం తెలుసుకున్నారు.. భార్య కుటుంబసభ్యులు. హడావుడిగా మృతురాలి అన్నయ్య, చెల్లి ఇంటికి చేరుకున్నారు. తన సోదరి ఇంట్లో భయానక దృశ్యాన్ని చూసి వాళ్లు భయపడ్డాడు.
READ MORE: Snake Bite: పాముతో ఫొటో దిగాలని బలవంతం పెట్టిన మిత్రులు..సర్పం కాటుకు యువకుడి బలి
వెంటనే అంబాబ్ పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎఫ్ఎస్ఎల్ బృందం కూడా అక్కడికక్కడే పరిశీలించింది. ఛాయాను ఆమె భర్త ఆనంద్ శర్మ హత్య చేసి ఉంటాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనుమానంతో భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే ఘటనపై ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!