BRS: శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన..
- శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన
- పసుపుకు 15 వేల మద్దతు ధర చెల్లించాలి
- పసుపు రైతులను వెంటనే ఆదుకోవాలి అంటూ నిరసన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ శాసన సభ, మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలి ప్రారంభమైన కాసేపటికే శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. పసుపుకు 15 వేల మద్దతు ధర చెల్లించాలని.. పసుపు రైతులను వెంటనే ఆదుకోవాలి అంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి మాట్లాడుతూ.. కేంద్రం పసుపు బోర్డు ప్రకటించిన కానీ దానికి చట్టబద్దత లేదని ఆరోపించారు. నామమాత్రపు ప్రకటన చేసింది.. తక్షణమే పసుపు బోర్డుకు కేంద్రం చట్టబద్దత కల్పించాలని మధుసూదనా చారి డిమాండ్ చేశారు.
Read Also: IML 2025 Final: ఫైనల్ చేరిన వెస్టిండీస్.. టైటిల్ కోసం భారత్తో అమితుమీ
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
పసుపుకు రూ.9 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15 వేలు మద్దతు ధర ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు చెల్లించలేదని మధుసూదనా చారి తెలిపారు. రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది.. కేసీఆర్ నాయకత్వంలో రైతుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని మధుసూదనా చారి వెల్లడించారు.
Read Also: IPL 2025 Captains: ఈసారి ఐపిఎల్ లో కొత్త కెప్టెన్స్ వీళ్లే..
మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగనుంది. ఈ క్రమంలో.. తెలంగాణ అసెంబ్లీ దద్దిరిల్లే అవకాశం ఉంది. రైతు భరోసా, దావోస్ పెట్టుబడులు, ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లతో పాటు పలు అంశాలపై గవర్నర్ ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారమే చర్చ జరగాల్సి ఉండగా.. విపక్షాల నినాదాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో.. ఎమ్మె్ల్యే జగదీష్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేశారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. నిన్న హోళీ కావడంతో అసెంబ్లీ సమావేశాలు జరగలేదు. దీంతో ఇవాళ గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ సమాధానం ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?