BRS: శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన..
- శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన
- పసుపుకు 15 వేల మద్దతు ధర చెల్లించాలి
- పసుపు రైతులను వెంటనే ఆదుకోవాలి అంటూ నిరసన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ శాసన సభ, మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలి ప్రారంభమైన కాసేపటికే శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. పసుపుకు 15 వేల మద్దతు ధర చెల్లించాలని.. పసుపు రైతులను వెంటనే ఆదుకోవాలి అంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి మాట్లాడుతూ.. కేంద్రం పసుపు బోర్డు ప్రకటించిన కానీ దానికి చట్టబద్దత లేదని ఆరోపించారు. నామమాత్రపు ప్రకటన చేసింది.. తక్షణమే పసుపు బోర్డుకు కేంద్రం చట్టబద్దత కల్పించాలని మధుసూదనా చారి డిమాండ్ చేశారు.
Read Also: IML 2025 Final: ఫైనల్ చేరిన వెస్టిండీస్.. టైటిల్ కోసం భారత్తో అమితుమీ
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
పసుపుకు రూ.9 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15 వేలు మద్దతు ధర ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు చెల్లించలేదని మధుసూదనా చారి తెలిపారు. రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది.. కేసీఆర్ నాయకత్వంలో రైతుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని మధుసూదనా చారి వెల్లడించారు.
Read Also: IPL 2025 Captains: ఈసారి ఐపిఎల్ లో కొత్త కెప్టెన్స్ వీళ్లే..
మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగనుంది. ఈ క్రమంలో.. తెలంగాణ అసెంబ్లీ దద్దిరిల్లే అవకాశం ఉంది. రైతు భరోసా, దావోస్ పెట్టుబడులు, ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లతో పాటు పలు అంశాలపై గవర్నర్ ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారమే చర్చ జరగాల్సి ఉండగా.. విపక్షాల నినాదాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో.. ఎమ్మె్ల్యే జగదీష్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేశారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. నిన్న హోళీ కావడంతో అసెంబ్లీ సమావేశాలు జరగలేదు. దీంతో ఇవాళ గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ సమాధానం ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!