BRS : శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన
- తెలంగాణ బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన
- కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు అమలవుతాయా? బీఆర్ఎస్ ప్రశ్నలు
- "అప్పులు ఆకాశంలో - అభివృద్ధి పాతాళంలో" అంటూ బీఆర్ఎస్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీలు శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ అభివృద్ధి పనులు శూన్యంగా ఉన్నాయని ఆరోపిస్తూ, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. “అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో” అంటూ నినాదాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. “అప్పు రూ. 1,58,000 కోట్లు – అభివృద్ధి శూన్యం” అని రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆరోపించారు. “రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసి ఎంతమంది మహిళలకు రూ. 2,500 ఇచ్చారు?” అని ప్రశ్నించారు. అలాగే, “ఎంతమంది వృద్ధులకు రూ. 4,000 పెన్షన్ ఇచ్చారు?” అని నిలదీశారు. అంతేకాకుండా, “రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసి ఎంతమంది ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారు?” అని నినాదాలు చేస్తూ, యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామన్న కాంగ్రెస్ హామీని గుర్తు చేశారు. “ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు?” అంటూ ‘కల్యాణమస్తు’ పథకం కింద ఇచ్చిన హామీలపైనా ప్రశ్నలు సంధించారు.
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
“అప్పులు ఘనంగా ఉన్నాయి, కానీ అభివృద్ధి శూన్యంగా ఉంది” అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేసినప్పటికీ, ఆ నిధులు ప్రజా సంక్షేమానికి ఉపయోగపడలేదని, అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదని ఆరోపించారు. ఈ నిరసన ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకురావాలని తాము భావిస్తున్నామని ఎమ్మెల్సీలు తెలిపారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
VC Sajjanar : ఉద్యోగుల సంపూర్ణ ఆరోగ్యమే సంస్థకు అసలైన సంపద
తాజావార్తలు
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!