BRS : శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన
- తెలంగాణ బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన
- కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు అమలవుతాయా? బీఆర్ఎస్ ప్రశ్నలు
- "అప్పులు ఆకాశంలో - అభివృద్ధి పాతాళంలో" అంటూ బీఆర్ఎస్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీలు శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ అభివృద్ధి పనులు శూన్యంగా ఉన్నాయని ఆరోపిస్తూ, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. “అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో” అంటూ నినాదాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. “అప్పు రూ. 1,58,000 కోట్లు – అభివృద్ధి శూన్యం” అని రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆరోపించారు. “రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసి ఎంతమంది మహిళలకు రూ. 2,500 ఇచ్చారు?” అని ప్రశ్నించారు. అలాగే, “ఎంతమంది వృద్ధులకు రూ. 4,000 పెన్షన్ ఇచ్చారు?” అని నిలదీశారు. అంతేకాకుండా, “రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసి ఎంతమంది ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారు?” అని నినాదాలు చేస్తూ, యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామన్న కాంగ్రెస్ హామీని గుర్తు చేశారు. “ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు?” అంటూ ‘కల్యాణమస్తు’ పథకం కింద ఇచ్చిన హామీలపైనా ప్రశ్నలు సంధించారు.
Also Read
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
“అప్పులు ఘనంగా ఉన్నాయి, కానీ అభివృద్ధి శూన్యంగా ఉంది” అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేసినప్పటికీ, ఆ నిధులు ప్రజా సంక్షేమానికి ఉపయోగపడలేదని, అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదని ఆరోపించారు. ఈ నిరసన ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకురావాలని తాము భావిస్తున్నామని ఎమ్మెల్సీలు తెలిపారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
VC Sajjanar : ఉద్యోగుల సంపూర్ణ ఆరోగ్యమే సంస్థకు అసలైన సంపద
తాజావార్తలు
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!