MLA Laxma Reddy: అభివృద్ధి మరింతగా కొనసాగాలంటే.. కారు గుర్తుకే ఓటు వేయండి: లక్ష్మారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Laxma Reddy’s Election Campaign in Balanagar: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2023కి సమయం దగ్గరపడుతోంది. దాంతో ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి సీ లక్ష్మారెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బాలానగర్ మండలం గాలిగూడెం మరియు కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో సీ లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. మహిళలు ఆయనకు ఘన స్వగతం పలుకుతున్నారు. లక్ష్మారెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంకు మంచి స్పందన వస్తోంది. రాత్రి కూడా జనాలు ఆయన వెంట నడుస్తున్నారు. గాలిగూడెం, కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో లక్ష్మారెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బాలానగర్ మండల ముఖచిత్రం మారిందని, అభివృద్ధి మరింతగా కొనసాగడానికి కారు గుర్తుకు ఓటు వేసి లక్ష మెజారిటీతో తమను గెలిపించాలని కోరారు.
Also Read
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
Also Read: Amit Shah-Vijayashanti: సూర్యాపేటలో అమిత్ షా సభ.. రాములమ్మ సభకు హాజరవుతారా?
‘గత ప్రభుత్వాలు పల్లెలను పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడ్డాక పల్లెల రూపురేఖలను బీఆర్ఎస్ మార్చింది. గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఏర్పాటు చేశాం. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు ఏర్పాటు చేసి అంటు వ్యాధులు ప్రబలకుండా గ్రామాలను, తండాలను కాపాడుకుంటున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బాలానగర్ మండల ముఖచిత్రం మారింది. అభివృద్ధి మరింతగా కొనసాగడానికి కారు గుర్తుకు ఓటు వేసి లక్ష మెజారిటీతో గెలిపించాలి’ అని లక్ష్మారెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?