Amit Shah-Vijayashanti: సూర్యాపేటలో అమిత్ షా సభ.. రాములమ్మ సభకు హాజరవుతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Amit Shah’s Adress Meeting in Suryapet Today: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దాంతో దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో పాలన కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణలో కూడా విజయం సాధించాలని చూస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ నేతలు రాష్ట్రంలో తరచుగా పర్యటిస్తున్నారు. నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
మంత్రి అమిత్ షా సూర్యాపేటలో బహిరంగ సభను ముగించుకుని సాయంత్రం 5.45 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఈ బహిరంగ సభకు ముందే తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహిస్తారని సమాచారం. ఈ పర్యటన కోసం అమిత్ షా గురువారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రి నేషనల్ పోలీస్ అకాడమీలో ఆయన బస చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు 75వ బ్యాచ్ పోలీసింగ్ ఔట్ పరేడ్లో పాల్గొన్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: MAD : ఓటీటీ లోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ…
సీనియర్ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ సభ జరుగుతుండడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ఏం మాట్లాడతారనే దానిపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. సూర్యాపేట బహిరంగ సభకు రాములమ్మ (విజయ శాంతి) హాజరవుతారా? లేదా అని కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే విజయ శాంతి గత కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!