KCR: త్వరలో ఢిల్లీకి బీఆర్ఎస్ అధినేత.. ఓటమి తర్వాత తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ వారంలోనే ఆయన హస్తిన టూర్ ఉంటుందని చెబుతున్నారు పార్టీ శ్రేణులు. కాగా.. ఎన్నికల తర్వాత మొదటిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన మూడు నెలల సమయం తర్వాత ఢిల్లీకి వెళ్తున్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత కేసీఆర్ జారిపడటంతో తుంటి విరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్.. ఇప్పుడిప్పుడే కోలుకుని నడవగలుగుతున్నారు. అంతేకాకుండా.. మొన్న నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఈ సమయంలో ఢిల్లీ వెళ్తున్న దానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఢిల్లీలో కేసీఆర్.. ఎవరిని కలుస్తున్నారన్న దానిపై చర్చ జరుగుతుంది. ఢిల్లీలో కేసీఆర్ ఎవరితో భేటీ అవుతారన్న దానిపై స్పష్టత రాలేదు. ఏ ఎజెండా మీద ఢిల్లీకి వెళ్తున్నారన్నది తెలియాల్సి ఉంది. అయితే కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో క్లారిటే వచ్చే అవకాం ఉంది.
Also Read
- IND Vs AFG: రోహిత్ 'చారిత్రాత్మక' రికార్డు.. గిల్ 'మెరుపు' ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
- Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
- Chiranjeevi : చరణ్ కష్టం చూసి 'ఇంత అవసరమా' అనుకున్నా
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa: గుడ్న్యూస్.. రేపే వారి ఖాతాల్లో సొమ్ము జమ
మరోవైపు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటపెట్టే పనిలో మునిగిపోయింది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టింది. ఇటీవలే అసెంబ్లీలో ప్రాజెక్టులపై శ్వేతపత్రం కూడా విడుదల చేసి.. కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాగస్వామ్యమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒంటరిగా పోటీ చేసి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని ఓడించడం కష్టమనే అభిప్రాయానికి వచ్చారు కేసీఆర్. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ బలానికి బీజేపీ క్యాడర్ కూడా తోడు అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించవచ్చనే ఆలోచనతో ఉన్నారు కేసీఆర్.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పొత్తు కోసం ఢిల్లీ వెళ్తున్నారా.. లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టులో తమను తప్పించమని కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద విజ్ఞప్తి చేయడానికా అనేదానిపై ప్రచారం జోరుగా సాగుతోంది.
- Tags
- BRS Chief
- Delhi
- kcr
- telugu news
- tour
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!