Tamil Nadu: బ్రైడ్ ఆఫ్ తమిళనాడు.. మళ్లీ అభాసుపాలైన స్టాలిన్ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో (Tamil Nadu) స్టాలిన్ సర్కార్ (CM Stalin Government) మరోసారి విమర్శల పాలైంది. ఇటీవలే భారత్ రాకెట్పై చైనా జెండా బ్యానర్ వేసి రాష్ట్రంలోని విపక్ష పార్టీల నుంచి.. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకుంది. తాజాగా మరో బ్యానర్ ఇప్పుడు విమర్శల పాలైంది.
తమిళనాడులో తాజాగా ప్రదర్శింపబడిన ఓ బ్యానర్ ఇప్పుడు పొలిటికల్గా రచ్చ రచ్చ చేస్తోంది. ఫ్రైడ్ ఆప్ తమిళనాడు అని రాయాల్సిన చోట బ్రైడ్ ఆప్ తమిళనాడు అంటూ రాశారు. దీంతో ఆ బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఈ బ్యానర్ ఎందుకు? దేని కోసం ప్రదర్శించారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఆంగ్లం తెలియక ఇలా రాశారా? లేకుంటే ఉద్దేశపూర్వకంగానే ఇలా రాశారా? తెలియదు గానీ.. నెట్టింట మాత్రం చర్చ నడుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను తమిళనాడు పెళ్లి కూతురుగా అభివర్ణిస్తూ రాశారు. మరి పెళ్లికొడుకు ఏవరంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తమిళనాడు వాళ్లకు ఆంగ్లంలో బాగానే పట్టు ఉందని.. వరుడు కూడా ఎవరో చెబితే బాగుంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
చైనా జెండాతో వివాదం
ఇటీవల డీఎంకే ప్రభుత్వం కులశేఖరపట్నంలో ఇస్రో రెండవ లాంచ్ ప్యాడ్ కాంప్లెక్స్కు శంకుస్థాపన జరిగింది. అయితే దీన్ని పురస్కరించుకుని డీఎంకే ఒక పత్రిక ప్రకటన వేశారు. అందులో భారత్ రాకెట్పై చైనా జెండా ముద్రించారు. దీంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అంతేకాకుండా ప్రతిపక్షాల నుంచి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ నడిచాయి. ఈ వివాదం సద్దుమణకముందే స్టాలిన్ సర్కార్ మరో వివాదంలో ఇరుక్కుంది. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
చైనా జెండా వివాదం వెలుగులోకి వచ్చిన వెంటనే బీజేపీ నేతలు, ప్రధాని మోడీ కూడా డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇస్రో రెండవ లాంచ్ ప్యాడ్ను ప్రచారం చేసే రాకెట్ ప్రకటనలో అధికార డీఎంకే పార్టీ ‘చైనా జెండా’ను ఉపయోగించడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మరోవైపు అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన ప్రగతిని అంగీకరించేందుకు డీఎంకే సిద్ధంగా లేదంటూ ప్రధాని మోడీ ఆరోపించారు.
Oops!
Tamil Nadu's banner blunder turns Stalin into the 'Bride' of the state… instead of 'Pride? 🤑#BannerFail #TamilNadu pic.twitter.com/3ZJSGGjNw4— Nabila Jamal (@nabilajamal_) March 5, 2024
This advertisement by DMK Minister Thiru Anita Radhakrishnan to leading Tamil dailies today is a manifestation of DMK’s commitment to China & their total disregard for our country’s sovereignty.
DMK, a party flighing high on corruption, has been desperate to paste stickers ever… pic.twitter.com/g6CeTzd9TZ
— K.Annamalai (@annamalai_k) February 28, 2024
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!