Tamil Nadu: బ్రైడ్ ఆఫ్ తమిళనాడు.. మళ్లీ అభాసుపాలైన స్టాలిన్ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో (Tamil Nadu) స్టాలిన్ సర్కార్ (CM Stalin Government) మరోసారి విమర్శల పాలైంది. ఇటీవలే భారత్ రాకెట్పై చైనా జెండా బ్యానర్ వేసి రాష్ట్రంలోని విపక్ష పార్టీల నుంచి.. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకుంది. తాజాగా మరో బ్యానర్ ఇప్పుడు విమర్శల పాలైంది.
తమిళనాడులో తాజాగా ప్రదర్శింపబడిన ఓ బ్యానర్ ఇప్పుడు పొలిటికల్గా రచ్చ రచ్చ చేస్తోంది. ఫ్రైడ్ ఆప్ తమిళనాడు అని రాయాల్సిన చోట బ్రైడ్ ఆప్ తమిళనాడు అంటూ రాశారు. దీంతో ఆ బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read
- DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
ఈ బ్యానర్ ఎందుకు? దేని కోసం ప్రదర్శించారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఆంగ్లం తెలియక ఇలా రాశారా? లేకుంటే ఉద్దేశపూర్వకంగానే ఇలా రాశారా? తెలియదు గానీ.. నెట్టింట మాత్రం చర్చ నడుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను తమిళనాడు పెళ్లి కూతురుగా అభివర్ణిస్తూ రాశారు. మరి పెళ్లికొడుకు ఏవరంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తమిళనాడు వాళ్లకు ఆంగ్లంలో బాగానే పట్టు ఉందని.. వరుడు కూడా ఎవరో చెబితే బాగుంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
చైనా జెండాతో వివాదం
ఇటీవల డీఎంకే ప్రభుత్వం కులశేఖరపట్నంలో ఇస్రో రెండవ లాంచ్ ప్యాడ్ కాంప్లెక్స్కు శంకుస్థాపన జరిగింది. అయితే దీన్ని పురస్కరించుకుని డీఎంకే ఒక పత్రిక ప్రకటన వేశారు. అందులో భారత్ రాకెట్పై చైనా జెండా ముద్రించారు. దీంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అంతేకాకుండా ప్రతిపక్షాల నుంచి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ నడిచాయి. ఈ వివాదం సద్దుమణకముందే స్టాలిన్ సర్కార్ మరో వివాదంలో ఇరుక్కుంది. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
చైనా జెండా వివాదం వెలుగులోకి వచ్చిన వెంటనే బీజేపీ నేతలు, ప్రధాని మోడీ కూడా డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇస్రో రెండవ లాంచ్ ప్యాడ్ను ప్రచారం చేసే రాకెట్ ప్రకటనలో అధికార డీఎంకే పార్టీ ‘చైనా జెండా’ను ఉపయోగించడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మరోవైపు అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన ప్రగతిని అంగీకరించేందుకు డీఎంకే సిద్ధంగా లేదంటూ ప్రధాని మోడీ ఆరోపించారు.
Oops!
Tamil Nadu's banner blunder turns Stalin into the 'Bride' of the state… instead of 'Pride? 🤑#BannerFail #TamilNadu pic.twitter.com/3ZJSGGjNw4— Nabila Jamal (@nabilajamal_) March 5, 2024
This advertisement by DMK Minister Thiru Anita Radhakrishnan to leading Tamil dailies today is a manifestation of DMK’s commitment to China & their total disregard for our country’s sovereignty.
DMK, a party flighing high on corruption, has been desperate to paste stickers ever… pic.twitter.com/g6CeTzd9TZ
— K.Annamalai (@annamalai_k) February 28, 2024
తాజావార్తలు
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
ట్రెండింగ్
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!