Tamil Nadu: బ్రైడ్ ఆఫ్ తమిళనాడు.. మళ్లీ అభాసుపాలైన స్టాలిన్ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో (Tamil Nadu) స్టాలిన్ సర్కార్ (CM Stalin Government) మరోసారి విమర్శల పాలైంది. ఇటీవలే భారత్ రాకెట్పై చైనా జెండా బ్యానర్ వేసి రాష్ట్రంలోని విపక్ష పార్టీల నుంచి.. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకుంది. తాజాగా మరో బ్యానర్ ఇప్పుడు విమర్శల పాలైంది.
తమిళనాడులో తాజాగా ప్రదర్శింపబడిన ఓ బ్యానర్ ఇప్పుడు పొలిటికల్గా రచ్చ రచ్చ చేస్తోంది. ఫ్రైడ్ ఆప్ తమిళనాడు అని రాయాల్సిన చోట బ్రైడ్ ఆప్ తమిళనాడు అంటూ రాశారు. దీంతో ఆ బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ఈ బ్యానర్ ఎందుకు? దేని కోసం ప్రదర్శించారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఆంగ్లం తెలియక ఇలా రాశారా? లేకుంటే ఉద్దేశపూర్వకంగానే ఇలా రాశారా? తెలియదు గానీ.. నెట్టింట మాత్రం చర్చ నడుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను తమిళనాడు పెళ్లి కూతురుగా అభివర్ణిస్తూ రాశారు. మరి పెళ్లికొడుకు ఏవరంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తమిళనాడు వాళ్లకు ఆంగ్లంలో బాగానే పట్టు ఉందని.. వరుడు కూడా ఎవరో చెబితే బాగుంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
చైనా జెండాతో వివాదం
ఇటీవల డీఎంకే ప్రభుత్వం కులశేఖరపట్నంలో ఇస్రో రెండవ లాంచ్ ప్యాడ్ కాంప్లెక్స్కు శంకుస్థాపన జరిగింది. అయితే దీన్ని పురస్కరించుకుని డీఎంకే ఒక పత్రిక ప్రకటన వేశారు. అందులో భారత్ రాకెట్పై చైనా జెండా ముద్రించారు. దీంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అంతేకాకుండా ప్రతిపక్షాల నుంచి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ నడిచాయి. ఈ వివాదం సద్దుమణకముందే స్టాలిన్ సర్కార్ మరో వివాదంలో ఇరుక్కుంది. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
చైనా జెండా వివాదం వెలుగులోకి వచ్చిన వెంటనే బీజేపీ నేతలు, ప్రధాని మోడీ కూడా డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇస్రో రెండవ లాంచ్ ప్యాడ్ను ప్రచారం చేసే రాకెట్ ప్రకటనలో అధికార డీఎంకే పార్టీ ‘చైనా జెండా’ను ఉపయోగించడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మరోవైపు అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన ప్రగతిని అంగీకరించేందుకు డీఎంకే సిద్ధంగా లేదంటూ ప్రధాని మోడీ ఆరోపించారు.
Oops!
Tamil Nadu's banner blunder turns Stalin into the 'Bride' of the state… instead of 'Pride? 🤑#BannerFail #TamilNadu pic.twitter.com/3ZJSGGjNw4— Nabila Jamal (@nabilajamal_) March 5, 2024
This advertisement by DMK Minister Thiru Anita Radhakrishnan to leading Tamil dailies today is a manifestation of DMK’s commitment to China & their total disregard for our country’s sovereignty.
DMK, a party flighing high on corruption, has been desperate to paste stickers ever… pic.twitter.com/g6CeTzd9TZ
— K.Annamalai (@annamalai_k) February 28, 2024
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!