Brazil Plane Crash : బ్రెజిల్ లో కుప్పకూలిన విమానం..62మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brazil Plane Crash : బ్రెజిల్లోని విన్హెడో నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బ్రెజిల్లోని విన్హెడోలో 62 మందితో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల విమానం కూలిపోయిందని స్థానిక మీడియా సంస్థలు శుక్రవారం నివేదించాయి. బ్రెజిల్ ప్రాంతీయ విమానయాన సంస్థ VOEPASS 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కాస్కావెల్ నుండి గ్వారుల్హోస్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో సావో పాలో రాష్ట్రంలోని విన్హెడావో ప్రాంతంలో ఫ్లైట్ 2283-PS-VPB ప్రమాదానికి గురైనట్లు ధృవీకరించింది.
మెట్రోపాలిటన్ సావో పాలోకు వాయువ్యంగా 80 కిలోమీటర్లు (50 మైళ్ళు) దూరంలో ఉన్న విన్హెడో నగరంలో కూలిన విమాన ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే విషయాన్ని అధికారులు వివరించలేదు. అయితే స్థానికులు ఎవరూ బాధితులు కాదని ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం ఎలా కూలిపోతుందో వీడియోలో చూడవచ్చు. ముందుగా గాలిలో తేలియాడుతున్న విమానం తెగిన గాలిపటంలా నేలపై పడింది.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
Read Also:Paris Olympics: రెజ్లింగ్లో తొలి పతకం తెచ్చిన అమన్.. భారత్ ఖాతాలో మరో కాంస్యం..
BREAKING: Voepass Flight 2283, a large passenger plane, crashes in Vinhedo, Brazil pic.twitter.com/wmpJLVYbB3
— BNO News (@BNONews) August 9, 2024
VOEPASS ఒక ప్రకటనలో, ‘ఫ్లైట్ 2283లో ఉన్న మొత్తం 62 మంది అక్కడికక్కడే మరణించారని కంపెనీ ధృవీకరించింది. ఈ సమయంలో విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు సహాయాన్ని అందజేస్తామని ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు విచారణ చేపట్టారు. జనవరి 2023 తర్వాత ఇదే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం. నేపాల్లోని యేటి ఎయిర్లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో నిలిచిపోయి కుప్పకూలిన విమానంలో 72 మంది మరణించారు. ఆ విమానం ATR 72.. తుది నివేదిక లో ఫైలట్ తప్పిదమే కారమణని తేల్చింది.
విమానం నుంచి భారీగా పొగ, మంటలు వస్తున్నాయని బ్రెజిల్ టెలివిజన్ నెట్వర్క్ గ్లోబ్ న్యూస్ తెలిపింది. విమానం నివాస ప్రాంతంలో పడిపోయింది. విమాన ప్రమాదం తర్వాత దక్షిణ బ్రెజిల్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా సమావేశంలో హాజరైన ప్రజలను లేచి నిలబడి ఒక నిమిషం మౌనం పాటించాలని కోరారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారని అధ్యక్షుడు తతెలిపారు. అగ్నిమాపక దళం, మిలిటరీ పోలీసులు, పౌర రక్షణ అధికారుల బృందాలు విన్హెడోలో ప్రమాద స్థలంలో మోహరించాయి.
Read Also:Off The Record: రూట్ మారుస్తున్నారా..? బీజేపీకి దూరంగా ఉండాలని వైసీపీ డిసైడ్ అయిందా..?
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!