Brazil Plane Crash : బ్రెజిల్ లో కుప్పకూలిన విమానం..62మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brazil Plane Crash : బ్రెజిల్లోని విన్హెడో నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బ్రెజిల్లోని విన్హెడోలో 62 మందితో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల విమానం కూలిపోయిందని స్థానిక మీడియా సంస్థలు శుక్రవారం నివేదించాయి. బ్రెజిల్ ప్రాంతీయ విమానయాన సంస్థ VOEPASS 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కాస్కావెల్ నుండి గ్వారుల్హోస్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో సావో పాలో రాష్ట్రంలోని విన్హెడావో ప్రాంతంలో ఫ్లైట్ 2283-PS-VPB ప్రమాదానికి గురైనట్లు ధృవీకరించింది.
మెట్రోపాలిటన్ సావో పాలోకు వాయువ్యంగా 80 కిలోమీటర్లు (50 మైళ్ళు) దూరంలో ఉన్న విన్హెడో నగరంలో కూలిన విమాన ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే విషయాన్ని అధికారులు వివరించలేదు. అయితే స్థానికులు ఎవరూ బాధితులు కాదని ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం ఎలా కూలిపోతుందో వీడియోలో చూడవచ్చు. ముందుగా గాలిలో తేలియాడుతున్న విమానం తెగిన గాలిపటంలా నేలపై పడింది.
Also Read
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
- Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
Read Also:Paris Olympics: రెజ్లింగ్లో తొలి పతకం తెచ్చిన అమన్.. భారత్ ఖాతాలో మరో కాంస్యం..
BREAKING: Voepass Flight 2283, a large passenger plane, crashes in Vinhedo, Brazil pic.twitter.com/wmpJLVYbB3
— BNO News (@BNONews) August 9, 2024
VOEPASS ఒక ప్రకటనలో, ‘ఫ్లైట్ 2283లో ఉన్న మొత్తం 62 మంది అక్కడికక్కడే మరణించారని కంపెనీ ధృవీకరించింది. ఈ సమయంలో విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు సహాయాన్ని అందజేస్తామని ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు విచారణ చేపట్టారు. జనవరి 2023 తర్వాత ఇదే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం. నేపాల్లోని యేటి ఎయిర్లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో నిలిచిపోయి కుప్పకూలిన విమానంలో 72 మంది మరణించారు. ఆ విమానం ATR 72.. తుది నివేదిక లో ఫైలట్ తప్పిదమే కారమణని తేల్చింది.
విమానం నుంచి భారీగా పొగ, మంటలు వస్తున్నాయని బ్రెజిల్ టెలివిజన్ నెట్వర్క్ గ్లోబ్ న్యూస్ తెలిపింది. విమానం నివాస ప్రాంతంలో పడిపోయింది. విమాన ప్రమాదం తర్వాత దక్షిణ బ్రెజిల్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా సమావేశంలో హాజరైన ప్రజలను లేచి నిలబడి ఒక నిమిషం మౌనం పాటించాలని కోరారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారని అధ్యక్షుడు తతెలిపారు. అగ్నిమాపక దళం, మిలిటరీ పోలీసులు, పౌర రక్షణ అధికారుల బృందాలు విన్హెడోలో ప్రమాద స్థలంలో మోహరించాయి.
Read Also:Off The Record: రూట్ మారుస్తున్నారా..? బీజేపీకి దూరంగా ఉండాలని వైసీపీ డిసైడ్ అయిందా..?
తాజావార్తలు
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?