Botsa Satyanarayana : కూటమి ప్రభుత్వం ఆరునెలల్లో లక్ష కోట్లు అప్పు చేసింది
- ఎన్నికల హామీలను పక్కనబెట్టిన ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తోంది
- జనవరి 3న జరగాల్సిన వసతి దీవెన ఆందోళనలను పరీక్షల నేపథ్యంలో జనవరి 29కి వాయిదా
- కూటమి ప్రభుత్వం ఆరునెలల్లో లక్ష కోట్లు అప్పు చేసింది
- ఎమ్మెల్సీ బొత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana : విద్యుత్ చార్జీలపై రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకత ను చూసైనా ప్రభుత్వం వెనక్కు తగ్గాలన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను పక్కనబెట్టిన ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తోందన్నారు. జనవరి 3న జరగాల్సిన వసతి దీవెన ఆందోళనలను పరీక్షల నేపథ్యంలో జనవరి 29కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆరునెలల్లో లక్ష కోట్లు అప్పు చేసిందన్నారు బొత్స సత్యనారాయణ. ఈ స్థాయిలో అప్పులు చేసి పెన్షన్ 4 వేలు తప్ప ఇక ఏమి మేలు చేశారో చెప్పాలన్నారు. ప్రజలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా పది లక్షల కోట్లు అప్పులు చేయడానికి ప్రభుత్వం మానసికంగా సిద్ధం అయినట్టు కనిపిస్తోందన్నారు బొత్స సత్యనారాయణ. హనీమూన్ పీరియడ్ అయిపొయింది…..ఆత్మ పరిశీలన చేసుకుని హామీలు అమలు చేయండన్నారు.
Jeevan Reddy: కేంద్రం మన్మోహన్ సింగ్ను భారత రత్నతో గౌరవించాలి..
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
అంతేకాకుండా..’కొత్త సంవత్సరంలోనైన ప్రజలను సుఖంగా ఉండనివ్వండి….. ఫ్రీ బస్సు లాంటి తక్కువ ఖర్చుతో అయిపోయే హమీలు నెరవేర్చడానికి ఇబ్బందులు ఎందుకు… విద్యుత్ చార్జీలు పెంపు ఎవరి పాపమో మంత్రులకు తెలియదా….చదువుకో లేదా…?. ధాన్యంలో తేమ లెక్కలు చూపించి 20 నుంచి 30శాతం కోత పెడుతున్నారు… ప్రభుత్వం తెచ్చిన అప్పులు, సూపర్ 6పై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం…. సూపర్ 6 అమలు కోసం ప్రభుత్వాన్ని నిలదీసి పని చేయిస్తాం….. తప్పు చేసిన, ఇచ్చిన మాట హామీలు నెరవేర్చ క పోయిన ప్రశ్నిస్తా నని చెప్పిన.. డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు మాట్లాడటం లేదు….. ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద వుంది…. ప్రజా సమస్యలపై పోరాటంలో కలిసి వచ్చే వాళ్ళను కలుపుకుని వెళ్లే ఆలోచన చేస్తాం…. కొండపల్లి ఇష్యూ తెలుగుదేశం పార్టీ క్రియేషన్….. వాళ్ళలో వాళ్ళే సృష్టించుకుంటున్నారు…..గతంలో ఇటువంటి వ్యవహారాలు వుండేవి కాదు…… అభద్రత భావంతో వున్న వాళ్ళే ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు… కొండపల్లిని ఇబ్బంది పెట్టే చర్యలు….బలిచ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది…. నా కాళ్ళకు మొక్కారా లేదా అనేది అప్రస్తుతం….ఆ వ్యవహారం జోలికి నేను వెళ్ళను….. టీడీపీ నాయకులు విజయనగరం వెళ్లి చూస్తే బొత్స మార్క్ అభివృద్ది ఏమిటో తెలుస్తుంది….’ అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు.
Puri Musings: న్యూయర్ వేళ.. “భక్తుడు-దేవుడు” ఆసక్తికర కథ చెప్పిన పూరి జగన్నాథ్..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!