Amit Shah: ప్రధాని చంద్రయాన్ను ప్రారంభిస్తే.. సోనియా ‘రాహుల్యాన్’ను ప్రయోగిస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇండియా కూటమిపై మాటలతో దాడి చేసారు. మహారాష్ట్రలోని జలగావ్లో జరిగిన యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ చేపట్టిన ‘రాహుల్ యాన్’ ప్రయోగం 19 సార్లు ఘోరంగా విఫలమైందని, 20వ ప్రయత్నానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.
Read Also: Taiwan Minister: భారతీయులపై ‘జాత్యహంకార’ వ్యాఖ్యలపై తైవాన్ మంత్రి క్షమాపణలు
Also Read
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
ఒకవైపు ప్రధాని మోడీ చంద్రయాన్ మిషన్ను ప్రారంభించారు. మరోవైపు సోనియాగాంధీ 20వ సారి రాహుల్ గాంధీని ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె 19 సార్లు ‘రాహుల్-యాన్’ను ప్రయోగించారు, అన్నీ విఫలమయ్యాయి” అని జల్గావ్ ర్యాలీలో అమిత్ షా పేర్కొన్నారు. .తమ కుమారులు, కూతుళ్లు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారని ఆయన ఇండియా కూటమి పార్టీలపై దాడి చేశారు. సోనియా రాహుల్ని ప్రధానిని చేయాలని, ఉద్ధవ్ (ఠాక్రే) తన కొడుకు ఆదిత్యను ముఖ్యమంత్రిని చేయాలని, (శరద్) పవార్ తన కుమార్తెను ముఖ్యమంత్రిని చేయాలని, మమతా దీదీ తన మేనల్లుడిను ముఖ్యమంత్రిని చేయాలని, స్టాలిన్ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.” అని బీజేపీ నేత అమిత్ షా అన్నారు.
అమిత్ షా తన ప్రసంగంలో, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంటులో తనను కలవడానికి వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తే జమ్మూ కాశ్మీర్లో ప్రతిచోటా రక్తపాతం జరుగుతుందని చెప్పారని ఆయన అన్నారు. “రక్తం గురించి మరచిపోండి, గులకరాళ్లు కూడా విసిరేందుకు ఎవరూ సాహసించలేదు” అని అమిత్ షా తన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు. యువత తమ ఫ్రాంచైజీని వినియోగించుకునే ముందు సాధకబాధకాలను క్షుణ్ణంగా బేరీజు వేసుకోవాలని ఆయన కోరారు.‘బీజేపీకి ఓటేయడం అంటే యువత ఉజ్వల భవిష్యత్తు కోసం, గొప్ప భారతదేశాన్ని నిర్మించడం కోసం ఓటేయడం.. బీజేపీకి ఓటేయడం అంటే నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేయడం కోసం ఓటేయడమే’ అన్నారాయన.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!