Amit Shah: ప్రధాని చంద్రయాన్ను ప్రారంభిస్తే.. సోనియా ‘రాహుల్యాన్’ను ప్రయోగిస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇండియా కూటమిపై మాటలతో దాడి చేసారు. మహారాష్ట్రలోని జలగావ్లో జరిగిన యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ చేపట్టిన ‘రాహుల్ యాన్’ ప్రయోగం 19 సార్లు ఘోరంగా విఫలమైందని, 20వ ప్రయత్నానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.
Read Also: Taiwan Minister: భారతీయులపై ‘జాత్యహంకార’ వ్యాఖ్యలపై తైవాన్ మంత్రి క్షమాపణలు
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ఒకవైపు ప్రధాని మోడీ చంద్రయాన్ మిషన్ను ప్రారంభించారు. మరోవైపు సోనియాగాంధీ 20వ సారి రాహుల్ గాంధీని ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె 19 సార్లు ‘రాహుల్-యాన్’ను ప్రయోగించారు, అన్నీ విఫలమయ్యాయి” అని జల్గావ్ ర్యాలీలో అమిత్ షా పేర్కొన్నారు. .తమ కుమారులు, కూతుళ్లు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారని ఆయన ఇండియా కూటమి పార్టీలపై దాడి చేశారు. సోనియా రాహుల్ని ప్రధానిని చేయాలని, ఉద్ధవ్ (ఠాక్రే) తన కొడుకు ఆదిత్యను ముఖ్యమంత్రిని చేయాలని, (శరద్) పవార్ తన కుమార్తెను ముఖ్యమంత్రిని చేయాలని, మమతా దీదీ తన మేనల్లుడిను ముఖ్యమంత్రిని చేయాలని, స్టాలిన్ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.” అని బీజేపీ నేత అమిత్ షా అన్నారు.
అమిత్ షా తన ప్రసంగంలో, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంటులో తనను కలవడానికి వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తే జమ్మూ కాశ్మీర్లో ప్రతిచోటా రక్తపాతం జరుగుతుందని చెప్పారని ఆయన అన్నారు. “రక్తం గురించి మరచిపోండి, గులకరాళ్లు కూడా విసిరేందుకు ఎవరూ సాహసించలేదు” అని అమిత్ షా తన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు. యువత తమ ఫ్రాంచైజీని వినియోగించుకునే ముందు సాధకబాధకాలను క్షుణ్ణంగా బేరీజు వేసుకోవాలని ఆయన కోరారు.‘బీజేపీకి ఓటేయడం అంటే యువత ఉజ్వల భవిష్యత్తు కోసం, గొప్ప భారతదేశాన్ని నిర్మించడం కోసం ఓటేయడం.. బీజేపీకి ఓటేయడం అంటే నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేయడం కోసం ఓటేయడమే’ అన్నారాయన.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!