Amit Shah: ప్రధాని చంద్రయాన్ను ప్రారంభిస్తే.. సోనియా ‘రాహుల్యాన్’ను ప్రయోగిస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇండియా కూటమిపై మాటలతో దాడి చేసారు. మహారాష్ట్రలోని జలగావ్లో జరిగిన యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ చేపట్టిన ‘రాహుల్ యాన్’ ప్రయోగం 19 సార్లు ఘోరంగా విఫలమైందని, 20వ ప్రయత్నానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.
Read Also: Taiwan Minister: భారతీయులపై ‘జాత్యహంకార’ వ్యాఖ్యలపై తైవాన్ మంత్రి క్షమాపణలు
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
ఒకవైపు ప్రధాని మోడీ చంద్రయాన్ మిషన్ను ప్రారంభించారు. మరోవైపు సోనియాగాంధీ 20వ సారి రాహుల్ గాంధీని ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె 19 సార్లు ‘రాహుల్-యాన్’ను ప్రయోగించారు, అన్నీ విఫలమయ్యాయి” అని జల్గావ్ ర్యాలీలో అమిత్ షా పేర్కొన్నారు. .తమ కుమారులు, కూతుళ్లు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారని ఆయన ఇండియా కూటమి పార్టీలపై దాడి చేశారు. సోనియా రాహుల్ని ప్రధానిని చేయాలని, ఉద్ధవ్ (ఠాక్రే) తన కొడుకు ఆదిత్యను ముఖ్యమంత్రిని చేయాలని, (శరద్) పవార్ తన కుమార్తెను ముఖ్యమంత్రిని చేయాలని, మమతా దీదీ తన మేనల్లుడిను ముఖ్యమంత్రిని చేయాలని, స్టాలిన్ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.” అని బీజేపీ నేత అమిత్ షా అన్నారు.
అమిత్ షా తన ప్రసంగంలో, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంటులో తనను కలవడానికి వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తే జమ్మూ కాశ్మీర్లో ప్రతిచోటా రక్తపాతం జరుగుతుందని చెప్పారని ఆయన అన్నారు. “రక్తం గురించి మరచిపోండి, గులకరాళ్లు కూడా విసిరేందుకు ఎవరూ సాహసించలేదు” అని అమిత్ షా తన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు. యువత తమ ఫ్రాంచైజీని వినియోగించుకునే ముందు సాధకబాధకాలను క్షుణ్ణంగా బేరీజు వేసుకోవాలని ఆయన కోరారు.‘బీజేపీకి ఓటేయడం అంటే యువత ఉజ్వల భవిష్యత్తు కోసం, గొప్ప భారతదేశాన్ని నిర్మించడం కోసం ఓటేయడం.. బీజేపీకి ఓటేయడం అంటే నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేయడం కోసం ఓటేయడమే’ అన్నారాయన.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!