NTV Telugu Site icon

Sridevi Biopic: నేను బతికుండగా.. శ్రీదేవి బయోపిక్‌కు అనుమతివ్వను: బోనీ

Sridevi Biopic

Sridevi Biopic

Boney Kapoor On Sridevi Biopic: దివంగత నటి ‘శ్రీదేవి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ఆరంభించిన ఆమె.. దాదాపుగా అగ్ర హీరోలు అందరి సరసన నటించారు. తన నటన, అభినయంతో ‘అతిలోక సుందరి’గా అన్ని భాషల్లోని సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. భారత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీదేవి.. 54 ఏళ్ల వయసులో (2018 ఫిబ్రవరి 24) మరణించారు. శ్రీదేవి బయోపిక్‌ రానున్నట్లు చాలా కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ స్పందించారు.

Also Read: Rishabh Pant-Shah Rukh: బాగా ఆడావ్.. పంత్‌ను మెచ్చుకున్న షారుక్ ఖాన్! వీడియో వైరల్

అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన ‘మైదాన్‌’ సినిమాకు బోనీ కపూర్‌ ఓ నిర్మాత. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది. మైదాన్‌ ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీదేవి బయోపిక్‌ ప్రస్తావన రాగా.. తాను బతికుండగా బయోపిక్‌కు అనుమతివ్వనని బోనీ చెప్పారు. ‘నా భార్య శ్రీదేవి చాలా ప్రైవేట్‌ పర్సన్‌. వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడానికి అస్సలు ఇష్టపదు. శ్రీదేవి జీవితం ప్రైవేట్‌గా ఉండాలి. అయితే ఎప్పటికీ ఉంటుందని నేను అనుకోను. కానీ నేను బతికి ఉన్నంతవరకు బయోపిక్‌కు అనుమతివ్వను’ అని బోనీ చెప్పారు.