Santosham Film Awards: ‘సంతోషం’లో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Santosham Film Awards: ఇరవై సంవత్సరాలుగా సినీ రంగంలో ఉత్తమ చిత్రాలను గుర్తించి పలు విభాగాల వారికి అవార్డులను అందజేస్తోంది సంతోషం సంస్థ. ప్రస్తుతం సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022కి సన్నద్ధమవుతోంది. కరోనా సమయంలో తప్పితే ప్రతేడాది సినీ పరిశ్రమలో ఉత్తమ విభాగాలను గుర్తించి వారికి అవార్డులను అందజేస్తున్నారు సురేష్ కొండేటి. సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలు అన్నింటికి అవార్డులు ఇస్తూ వస్తున్నారు. సురేష్ కొండేటి ఈసారి ఈ కార్యక్రమాన్ని మరో లెవెల్ కి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఒక బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ టాలీవుడ్ అవార్డుల ఫంక్షన్లో డ్యాన్స్ చేయబోతోంది అంటూ ముందుగానే ప్రకటించిన సంతోషం టీం. సరిగ్గా డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల 9 నిమిషాలకి ఆమె ఎవరు అనే విషయాన్ని రివీల్ చేసింది.
Read Also: Keerthy Suresh: కేజీఎఫ్ చిత్ర నిర్మాణ బ్యానర్లో మహానటి.. మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కీర్తి సురేష్
Also Read
ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఊర్వశితో ఈసారి సంతోషం ఫిలిం అవార్డ్స్ లో డ్యాన్స్ చేయబోతున్నారు. బాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో భాగమైన ఊర్వశీ రౌతేలా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పక్కన ఆమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది. బాస్.. వేర్ ఈజ్ ది పార్టీ అంటూ సాగుతున్న ఫుల్ మాస్ సాంగ్ లో ఆమె కనిపిస్తోంది. అలాగే రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. అయితే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకముందే సంతోషం ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది ఊర్వశి రౌతేలా. ఇక సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022 కార్యక్రమం ఈనెల 26న ఘనంగా జరగనుంది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సుమారు 12 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలాగా సంతోషం సురేష్ అనేక రకాల కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!