MS Dhoni: ధోనీ షాట్లకు బాలీవుడ్ నటి ఫిదా.. ఇంతకీ ఆమె ఎవరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యా్చ్లో సీఎస్కే ఉత్కంఠ విజయం సాధించింది. ముంబైలో మ్యాచ్ జరిగినప్పటికీ, ముంబై అభిమానులతో పాటు చెన్నై అభిమానులు కూడా లైవ్లో మ్యాచ్ తిలకించారు. అక్కడ కూడా.. చెన్నై చెన్నై అంటూ, ధోని ధోని అంటూ సీఎస్కే అభిమానుల అరుపులే ఎక్కువగా వినపడ్డాయి. అయితే.. ముంబైలో చెన్నై ఫ్యాన్స్ అధికంగా రావడానికి కారణం ‘తలా’. అదేనండీ మహేంద్ర సింగ్ ధోని. అతని ఆటను చూసేందుకు సీఎస్కే అభిమానులు భారీగా వచ్చారు. మొన్న హైదరాబాద్లో కూడా సీఎస్కే అభిమానులు ధోనీని చూసేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. అందుకు కారణమేంటంటే ఈ సీజన్కు ధోని చివరిదని అందరూ భావిస్తున్న క్రమంలో ధోనీ ఆటను చూసేందుకు ఫ్యాన్స్ తరలివస్తున్నారు.
Gidugu RudraRaju: రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి..!
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఇదిలా ఉంటే.. ఈ సీజన్ లో చెన్నై ఆడిన 6 మ్యాచ్ ల్లో ధోనీ బ్యాటింగ్ దిగింది కేవలం 3 మ్యాచ్ల్లోనే. మొదటి మ్యాచ్లో, నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్లో ఫ్యాన్స్ కు ఉత్సాహం నింపాడు. మరీ ముఖ్యంగా.. ఆడిన 4 బంతుల్లోనే 20 పరుగులతో చెలరేగాడు. వరుసగా 3 బంతుల్లో హ్యాట్రిక్ సిక్సులు కొట్టి ఫ్యాన్స్ కు కనువిందు చేశాడు. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. కూర్చున్న సీట్లలో నుంచి ధోనీ..ధోనీ అంటూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు. సామన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ధోనీ ఇన్నింగ్స్ ను ఎంజాయ్ చేశారు.
Cricket Betting: హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. రూ.2.5 కోట్లు సీజ్
దివంగత క్రికెటర్ బిషన్ సింగ్ బేడి కోడలు, బాలీవుడ్ నటి నేహా ధుపియా ధోనీ కొట్టిన షాట్లకు ఫిదా అయింది. సంతోషంతో పెద్దగా అరుస్తూ వైల్డ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నేహా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్ కు నేహా ధుపియా తన భర్త అంగద్ బేడి, ఫ్రెండ్స్ కరీనా కపూర్, జాన్ అబ్రహంతో కలిసి తిలకించింది. కాగా.. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..