Mumbai: ముంబైలో అనుమానాస్పద పడవ.. పోలీసుల అదుపులో ముగ్గురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో అనుమానాస్పద పడవను కనుగొన్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.. వారంతా తమిళనాడులోని కన్యాకుమారి వాసులని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయమై ముగ్గురు వ్యక్తులను విచారిస్తున్నారు. సంఘటనా స్థలంలో కోలాబా పోలీసులు చేరుకుని.. ఈ బోటును కువైట్ నుంచి తెప్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుగుతోంది. వారి వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న (మంగళవారం) ఉదయం 7:30 గంటల ప్రాంతంలో సుమరం చైత్రాలి అనే బోటు గేట్వే ఆఫ్ ఇండియా నుంచి లైట్హౌస్ ప్రాంతానికి సాధారణ మెరైన్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. అబ్దులా షరీఫ్-1 పేరుతో కువైట్కు చెందిన బోటును గుర్తించినట్లు పేర్కొన్నారు. బోటులో ఉన్న ముగ్గురిని విచారించగా ముగ్గురినీ రెండేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన కెప్టెన్ మదన్ అనే ఏజెంట్ పని నిమిత్తం కువైట్కు పంపారు. వారు అబ్దులా షరీఫ్కు చెందిన అబ్దులా అనే పడవలో గత రెండేళ్లుగా కువైట్లో మత్స్యకారులుగా పని చేస్తున్నాట్లు తెలిపారు.. అయితే, తిరిగి ఇండియాకు వచ్చేందుకు తమ పాస్ పోర్టులు ఇవ్వాలని కోరాగా.. అతను నిరాకరించాడు.. దీంతో వారు అక్కడ నుంచి పారిపోయి అబ్దుల్ షరీఫ్ బోటును తీసుకుని భారతదేశానికి వస్తున్న క్రమంలో ముంబైకి వచ్చారని పోలీసులు తెలిపారు. ఇక, 2008 నవంబర్లో ముంబైలో ఉగ్రదాడి చేసిన పది మంది పాకిస్తానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం నుంచి రావడం గమనార్హం. దీంతో సముద్ర మార్గాలపై పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
A suspcious boat, named "Abdullah Sharif", found near Gateway of India. The boat had three people onboard, all of them hail from Tamil Nadu's Kanyakumari. The boat has arrvied from Kuwait and has been impounded. The three people are being questioned. Colaba Police is present at…
— ANI (@ANI) February 6, 2024
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!