Srinagar: జీలం నదిలో పడవ బోల్తా.. ఏడుగురు సేఫ్, ఇద్దరు మిస్సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ కాశ్మీర్లోని హతివారా పుల్వామాలోని జీలం నదిలో బుధవారం పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది నీటిలో పడిపోయారు. కాగా.. అందులో ఏడుగురిని రక్షించారు, మరో ఇద్దరు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. SDRF రెస్క్యూ సిబ్బంది వారి సామగ్రితో తప్పిపోయిన వ్యక్తుల కోసం రంగంలోకి దిగారు. నదిలో ఇసుక తీసేందుకు వెళ్లి బోటు ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. పడవలో తొమ్మిది మంది కార్మికులు ఉండగా, వారంతా జమ్మూ కాశ్మీర్ వెలుపలి ప్రాంతాలకు చెందిన వారని పేర్కొన్నారు. బోటు బోల్తా పడడంతో ఒడ్డున ఉన్నవారు వెంటనే సాయం కోసం కేకలు వేయడంతో వారిని రక్షించేందుకు కొంత మంది నదిలోకి దూకారు.
Parshottam Rupala: క్షత్రియ వర్గాన్ని క్షమాపణ కోరిన కేంద్రమంత్రి
Also Read
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
నదిలో మునిగిపోయిన కూలీలను కాపాడే ప్రయత్నం చేశారు. కాగా, సమాచారం అందిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. కాగా.. ఏడుగురు కార్మికులను రక్షించారు.. మరో ఇద్దరు తప్పిపోయారు. ఈరోజు సాయంత్రం 7.15 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్న సీనియర్ SDRF అధికారి తెలిపారు. ఏడుగురు కార్మికులను రక్షించి ప్రథమ చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఇద్దరు కార్మికులు గల్లంతయ్యారని.. వారి కోసం అన్వేషణ కొనసాగుతోందన్నారు. చీకటి ఉన్నప్పటికీ, రెస్క్యూ వర్కర్లు నదిలో తప్పిపోయిన వ్యక్తుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!