Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయని గ్రహించే.. బీజేపీకి పట్ట కట్టారు..
- ఈ విజయం టీజీ ప్రజలకు, ఉపాధ్యాయులకు అంకితం
- రెండు ఎమ్మెల్సీలు ఏక కాలంలో రావడం చాలా సంతోషం
- మూడు స్థానాల్లో రెండు కీలకమైనవి
- కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో బీజేపీని గెలిపించారు
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి అఖండ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. “ఈ విజయం తెలంగాణ సమాజానికి, ఉపాధ్యాయులకు అంకితం ఇస్తున్నాం. రెండు ఎమ్మెల్సీలు ఏక కాలంలో రావడం చాలా సంతోషం. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని ఆదరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్దీ నెలల్లోనే కాంగ్రెస్ తో సమానంగా బీజేపీకి ఎంపీ సీట్లు కట్టబెట్టింది తెలంగాణ సమాజం. మూడు స్థానాల్లో రెండు కీలకమైనవి. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో బీజేపీని గెలిపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయని గ్రహించే రాష్ట్ర ప్రజలు బీజేపీని గెలిపించారు. రెండు ఎమ్మెల్సీల విజయంతో బీజేపీ బాధ్యత మరింత పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి బీజేపీపైన ఆనేక తప్పుడు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందింది.” అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: YS Jagan: ఎక్కడా రాజీ పడొద్దు.. పార్లమెంట్లో గట్టిగా గళమెత్తండి.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
Also Read
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
- AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో బీజేపీని గెలిపించారని.. కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. “శాసన మండలి, సభలో ప్రజల సమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. శాసన మండలి, సభలో తెలంగాణ ప్రజల గుండె చప్పుడు వినిపిస్తాం. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్టే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుతాయి. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనకు రెఫరండమని తాము అనడం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఇప్పటివరకైనా నెరవేర్చాలి
కాంగ్రెస్ గిఫ్ట్ మాకు అవసరం మాకు లేదు.. రాహుల్ గాంధీకి ఇచ్చుకోండి. తెలంగాణ ప్రజలు మాకు గిఫ్ట్ ఇస్తున్నారు.. ఇస్తారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుంది.” అని కిషన్ రెడ్డి కాంగ్రెస్ను విమర్శించారు.
READ MORE: Sankranthiki Vasthunam: ఫ్యామిలీ ఆడియన్స్’కి ఎక్కితే రిజల్ట్ ఇలానే ఉంటుంది!
తాజావార్తలు
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
-
GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
-
Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
-
Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!