BJP: బీజేపీ ఆరో జాబితా విడుదల.. ఏఏ రాష్ట్రాలంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆరో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ హైకమాండ్ వెల్లడించింది. రాజస్థాన్కు చెందిన రెండు నియోజకవర్గాలు, మణిపూర్కు చెందిన ఒక నియోజకవర్గానికి అభ్యర్థులను ప్రకటించింది. రాజస్థాన్లోని కరౌలీ ధోల్పూర్ (ఎస్సీ), దౌసా నియోజకవర్గాలు, ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గానికి అభ్యర్థులను వెల్లడించింది.
తొలి విడతలో 195 మందిని, రెండో విడతలో 72 మందిని, మూడో విడతలో 9 మందిని, నాల్గో విడతలో 15 మందిని, ఐదో విడతలో 111 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 405 మంది అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. మరికొన్ని స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి రికార్డ్ స్థాయిలో ఫలితాలు సాధించేందుకు కాషాయ పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్డీఏకు 400కు పైగా స్థానాలు కట్టబెట్టాలని ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిస్తున్నారు. వికసిత్ భారత్ కోసం ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read
ఇది కూడా చదవండి: Varun Gandhi: “మాతో చేరడానికి వరుణ్ గాంధీకి స్వాగతం”.. కాంగ్రెస్ ఆఫర్..
దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనున్నాయి. ఇక ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. అధికారం కోసం ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి తలపడుతున్నాయి. విజయంపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Anchor Suma : సుమ సౌందర్య తో కలిసి నటించిన సినిమా ఏదో తెలుసా?

Bjp
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!