BJP Manifesto: బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘సంకల్ప్ పత్ర’ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో కలిసి ప్రధాని మోడీ రిలీజ్ చేశారు. మోడీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో మేనిఫెస్టోను ఆవిష్కరించారు. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా సంకల్ప్ పత్రను రూపొందించినట్లు బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది. దీని కోసం 15 లక్షల సలహాలు, సూచనలను ఈ కమిటీ పరిశీలించింది.
Read Also: Peddireddy Ramachandra Reddy: ప్రజాదరణను చూసి ఓర్వలేక సీఎం జగన్పై దాడి చేశారు..
Also Read
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
- Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
- RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
అయితే, ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతి రోజు సంకల్ప్ పత్ర విడుదల సంతోషదాయకం అన్నారు. సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్ జీవితాంతం పోరాడారని పేర్కొన్నారు. అంబేడ్కర్ సూచించిన మార్గంలో తాము కూడా నడుస్తున్నామన్నారు. అంబేడ్కర్ ఆకాంక్షలను అమలు చేస్తున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. 2014లో మోడీ ప్రధాని కాగానే పేదల కోసమే బీజేపీ సర్కార్ అని చెప్పారని నడ్డా గుర్తు చేశారు. వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో తమ మేనిఫెస్టో చెబుతుంది.. అందరినీ కలుపుకుని ముందుకెళ్తేనే దేశ ప్రగతి సాధ్యం.. మోడీ నేతృత్వంలో పదేళ్లుగా దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని జేపీ నడ్డా వెల్లడించారు.
Read Also: Murder Express: అనువాదం తెచ్చిన తంటా.. హటియాను హత్య చేశారుగా..
ఇక, గ్రామాలకూ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామన్న జేపీ నడ్డా.. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నామని తెలిపారు. పేదలకు బియ్యం, గోధుమలు, పప్పులు అందిస్తున్నామన్నారు. ‘పేదల జీవితాల్లో మార్పు రావాలనేదే మా లక్ష్యం. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేదే మా నినాదం అని ఆయన చెప్పుకొచ్చారు. సామాజిక సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేశాం, అలాగే, అయోధ్యలో రామ మందిర్ నిర్మాణాన్ని పూర్తి చేశాం.. ట్రిపుల్ తలాక్ను తొలగించి ముస్లిం మహిళలకు మంచి చేశాం.. మహిళల రిజర్వేషన్ చట్టాన్ని తెచ్చాం.. కరోనాను ధైర్యంగా ఎదుర్కొని.. 9 నెలల్లోనే వ్యాక్సిన్ తయారు చేశాం.. కరోనా వ్యాక్సిన్ను వంద దేశాలకు ఎగుమతి చేశామన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 కోట్ల మందికి మేలు చేకూర్చామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.
#WATCH | Bharatiya Janata Party (BJP) releases its election manifesto – 'Sankalp Patra' for the ensuing Lok Sabha polls in the presence of Prime Minister Narendra Modi, Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and party President JP Nadda.#LokSabhaElection pic.twitter.com/WVB8Km1NWJ
— ANI (@ANI) April 14, 2024
తాజావార్తలు
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
-
Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!