Election Results 2024: బీజేపీ కాదు.. అత్యధిక అభ్యర్థులను నిలబెట్టిన పార్టీ ఇదే.. 1996 తర్వాత ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Results 2024: పద్దెనిమిదవ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఎనిమిది వేల మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో 16 శాతం మంది జాతీయ పార్టీలు, ఆరు శాతం మంది రాష్ట్ర స్థాయి పార్టీలు, 47 శాతం మంది స్వతంత్ర అభ్యర్థులు. ఈ సమాచారం ‘పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్’ నివేదికలో ఇవ్వబడింది. పీఆర్ఎస్ ప్రకారం, ఈ ఎన్నికల్లో, 543 లోక్సభ స్థానాలకు ఆరు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలతో సహా 744 పార్టీల నుండి 8,360 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నివేదిక ప్రకారం, 1996 తర్వాత అభ్యర్థుల సంఖ్య ఇదే అత్యధికం. 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 13,952 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 8039 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
అభ్యర్థులను నిలబెట్టడంలో బీజేపీ రెండో స్థానం
పద్దెనిమిదవ లోక్సభకు ఏడు దశల్లో ఓటింగ్ నిర్వహించబడింది. ఇది ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగిసింది. ఇవాళ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నివేదిక ప్రకారం, జాతీయంగా గుర్తింపు పొందిన ఆరు పార్టీలలో మాయావతి అధ్యక్షతన ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అత్యధికంగా 488 మంది అభ్యర్థులను నిలబెట్టింది. జాతీయ పార్టీల్లో బీజేపీ 441, కాంగ్రెస్ 328, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఎం) 52, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 22, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టాయి.
Also Read
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
Read Also: PM Modi, CM Nitish Meeting: ఎన్నికల ఫలితాలకు ముందు మోడీని కలిసిన నితీష్.. జోరందుకున్న ఊహాగానాలు
రాష్ట్ర స్థాయి పార్టీలలో, సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల పోటీలో గరిష్టంగా 71 మంది అభ్యర్థులను నిలబెట్టగా, తృణమూల్ కాంగ్రెస్ 48 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. ఏఐఏడీఎంకే 36, సీపీఐ 30, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25, ఆర్జేడీ 25, డీఎంకే 22 అభ్యర్థులు బరిలో నిలిచారు. PRS నివేదిక ప్రకారం, గుర్తింపు లేని పార్టీలలో, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) గరిష్టంగా 150 మంది అభ్యర్థులను నిలబెట్టింది. దీని తర్వాత పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా (డెమోక్రటిక్) 79 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఈ సారి 8వేల మందికి పైగా..
నివేదిక ప్రకారం ఒక్కో సీటుపై సగటున 15 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే, ఒక్కో రాష్ట్రంలో సీట్ల వారీగా అభ్యర్థుల సంఖ్య భిన్నంగా ఉంటుంది. తెలంగాణలో ఒక్కో సీటుకు అత్యధిక సగటు అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ ఒక్కో సీటుపై సగటున 31 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, లడఖ్, నాగాలాండ్లో సీట్ల వారీగా ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తమిళనాడులోని కరూర్ స్థానంలో అత్యధికంగా 54 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 46 (85 శాతం) మంది స్వతంత్ర అభ్యర్థులు.
పీఆర్ఎస్ నివేదికలో వెల్లడైన గణాంకాలు
ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునే అభ్యర్థుల సగటు వయసు 48 ఏళ్లు. జాతీయ పార్టీల అభ్యర్థుల్లో 13 శాతం మంది 40 ఏళ్ల లోపు వారు కాగా, బీఎస్పీ బరిలోకి దిగిన అభ్యర్థుల్లో 20 శాతం మంది 40 ఏళ్ల లోపు వారే. ప్రధాన పార్టీలు నిలబెట్టిన అభ్యర్థుల్లో 27 శాతం మంది ఇంతకు ముందు ఎంపీలుగా ఉన్నారు. వీరిలో 25 శాతం మంది గతంలో లోక్సభ సభ్యులు, నాలుగు శాతం మంది రాజ్యసభ సభ్యులు కాగా, రెండు శాతం మంది పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించారు.ప్రస్తుత లోక్సభలోని 327 మంది సభ్యులు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, వారిలో ఒకరు రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, 17వ లోక్సభలో 34 మంది సభ్యులు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
తాజావార్తలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!