సోమవారం ఎన్నికల సంఘాన్ని పశ్చిమ బెంగాలు బీజేపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా.. టీఎంసీ నేత పీయూష్ పాండాపై ఫిర్యాదు చేశారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రచారం చేయకుండా నిషేధించాలని ఎన్నికల కమిషన్ను బీజేపీ కోరింది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోడీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన సమయంలో తన కులాన్ని ఉద్దేశించి పాండా వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో.. రోజు ఢిల్లీలో ఈసీని కలిసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీని కలిసిన వారిలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్తో సహా బీజేపీ ప్రతినిధి బృందం ఉన్నారు.
Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్కు బిగ్ రిలీఫ్.. 14 ఏళ్ల జైలు శిక్ష రద్దు
అంతేకాకుండా.. పశ్చిమ బెంగాల్లోని బసిర్హత్ లోక్సభ స్థానం అభ్యర్థి రేఖా పాత్ర వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో.. టీఎంసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దేబ్గాన్షు భట్టాచార్యపై బీజేపీ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. ప్రచారం ముగిసేంత వరకు ట్విట్టర్ లో టీఎంసీ (TMC) ఖాతాను నిలిపివేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది.
Read Also: Heatwave warning: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తాయి.. ఐఎండీ హెచ్చరిక
గతంలో ప్రధాని నరేంద్ర మోదీపై పీయూష్ పాండా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ నేత సువేందు అధికారి ఎన్నికల కమిషన్ను కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా.. బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి ఈసీని కలిశారు.